రాత్రి 9 తర్వాత పెళ్లిళ్లు వద్దు ....
- January 23, 2018హైదరాబాద్:ఇక నుంచి హైదరాబాద్ నగరంలో రాత్రి తొమ్మిది గంటల తర్వాత వివాహాలు చేయాలంటే ఆలోచించాల్సిందే.. ఎందుకంటే అలా రాత్రి 9 తర్వాత పెళ్లిళ్లు చేస్తే కఠిన చర్యలు చేసుకొంటామని తెలంగాణ వక్ఫ్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. రాత్రివేళ 9 తర్వాత ముస్లింలు ఫంక్షన్ హల్స్ లో వివాహాలు చేసుకొంటున్నందున ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందుకనే ఇక నుంచి ఫిబ్రవరి 1 నుంచి రాత్రివేళ నగరంలో వివాహాలు నిషేధం పై ఉత్తర్వులు జారీ.. ఈ విషయం ను వక్ఫ్ బోర్డు చైర్మెన్ మహమ్మద్ సలీం ప్రకటించారు.
ఇక నుంచి రాత్రి వేళ 9 తర్వాత ఎవరైనా వివాహం చేస్తే.. ఆ ఖాజీలకు నోటీసులు జారీచేయడంతో పాటు.. వారికి వివాహ బుక్ లెట్ సర్టిఫికెట్లు జారీ చేయమని చెప్పారు. రాత్రివేళ సంగీతం జోరులో.. బాణాసంచా కాల్చడంతో ప్రజలకు అసౌకర్యంగా కలుగుతుందని భావించి రాత్రివేళ వివాహాలను రద్దు చేయడం శుభపరిణామమని ముస్లిం మత పెద్దలు వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..