అమెరికాలో హైదరాబాద్వాసి మృతి
- January 24, 2018
హైదరాబాద్: హైదరాబాద్ నగరవాసి యూఎస్లో కన్నుమూశాడు. ఐటీ ఉద్యోగి చైతన్యరెడ్డి(36) గుంటుక అనే వ్యక్తి గుండెపోటుకు గురై హుస్టన్ నగరంలో మృతిచెందాడు. సీనియర్ సాఫ్ట్వేర్ క్యూఏ అనలిస్ట్గా హుస్టన్లోని రాయల్ టెక్నోక్రాట్స్లో చైతన్య పనిచేస్తున్నాడు. యూఎస్లో ఐటీ ఉద్యోగిగా అతను పదేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఈ మధ్యనే అతను కంపెనీ మారాడు. హైదరాబాద్లోని శ్రీ సత్యసాయి కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ నుంచి పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్.. కర్ణాటకలోని గుల్బార్గా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తిచేసిన చైతన్య టెక్సాస్లోని లామర్స్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టాను అందుకున్నాడు. అంతిమ సంస్కారాల నిమిత్తం మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించేందుకు స్థానిక తెలంగాణ సంస్థ మృతుడి కుటుంబ సభ్యులకు సహకారం అందిస్తుంది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!