నీటిలో మునిగిన నెల్లూరు
- November 22, 2015
భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. వందలాది గ్రామాలు, కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. కొన్ని గ్రామాలు ఇప్పుడిప్పుడే వరద నీటి నుంచి బయటపడుతున్నయనుకోగానే.. మళ్లీ సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు డివిజన్ లో ఈ ఉదయం నుంచి కురుస్తున్నవాన జనజీవనాన్నిస్తంభింపజేసింది, ఇప్పటికీ కోవూరు, గూడూరు, సూళ్లూరుపేట, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలో 54 గ్రామాలు, కాలనీలు వరద నీటిలో చిక్కుకుని ఉన్నాయి. నెల్లూరు నగరంలోని పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. అటు తమిళనాడులోనూ మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ నెల 22 వరకు విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవును పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన మూడు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తమిళనాడులో దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







