నీటిలో మునిగిన నెల్లూరు
- November 22, 2015
భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. వందలాది గ్రామాలు, కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. కొన్ని గ్రామాలు ఇప్పుడిప్పుడే వరద నీటి నుంచి బయటపడుతున్నయనుకోగానే.. మళ్లీ సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు డివిజన్ లో ఈ ఉదయం నుంచి కురుస్తున్నవాన జనజీవనాన్నిస్తంభింపజేసింది, ఇప్పటికీ కోవూరు, గూడూరు, సూళ్లూరుపేట, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలో 54 గ్రామాలు, కాలనీలు వరద నీటిలో చిక్కుకుని ఉన్నాయి. నెల్లూరు నగరంలోని పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. అటు తమిళనాడులోనూ మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ నెల 22 వరకు విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవును పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన మూడు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తమిళనాడులో దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







