'కల్యాణివేనా? ఏం చేస్తున్నావ్?' అంటూ చంపేస్తున్నారు..!
- January 24, 2018
ప్రముఖ నటుడు నాగార్జున తనను చాలా ఇబ్బంది పెట్టారని, తన పనికి అంతరాయం కలిగేలా చేయడం వల్ల తాను చాలా నష్టపోయానని, దీనికి పరిహారంగా 50 లక్షల రూపాయలు చెల్లించాలని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వికాస్ ప్రజాపతి కోర్టుకెక్కినట్టు తెలుస్తోంది. అదేంటీ జార్ఖండ్ కి చెందిన వ్యక్తితో నాగార్జున కు ఉన్న సంబంధం ఏంటీ..ఎందుకు విసిగించారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి..! అసలు విషయానికి వస్తే..ఈ మద్య అక్కినేని అబ్బాయి అఖిల్ 'హలో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇది అఖిల్ రెండవ సినిమా..మొదటి సినిమా వివివినాయక్ దర్శకత్వంలో 'అఖిల్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేదు. ఆ తర్వాత మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇదలా ఉంటే..ఇప్పుడు ఈ సినిమాపై మరో సెస్సేషన్ టాక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో అక్కినేని అఖిల్ హీరోగా విడుదలైన 'హలో' సినిమాలో హీరోయిన్ కల్యాణి ఫోన్ నంబర్ తాను వాడుతున్న నంబర్ ఒకటే కావడంతో పలువురు అభిమానులు ఫోన్ చేసి, 'కల్యాణివేనా? ఏం చేస్తున్నావ్?' అంటూ విసిగిస్తున్నారని వాపోయాడు.మొదట ఈ నెంబర్ ఎవరిదో అని ఆరా తీయగా అన్నపూర్ణ ప్రొడక్షన్ లో నాగార్జున నిర్మించిన హలో సినిమాలో తన నెంబర్ వాడారని తెలుసుకొని కోర్టుకెక్కినట్లు తెలిపాడు.అయితే ఈ విషయంపై నాగార్జున స్పందిస్తూ.. టెలికం ఆపరేటర్ అనుమతి తీసుకున్నాకే ఆ నెంబర్ ను సినిమాలో వాడుకున్నామని ఇలా జరుగుతుందని ఊహించలేదని నాగ్ తెలిపారు. అసలే హలో, రంగుల రాట్నం సినిమాలు మిగిల్చిన నష్టాల్లో ఉన్న నాగార్జునకు ఇదో పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









