తొలి వాహనం ఎలక్ట్రిక్ కావాలి: పీయూష్ గోయల్
- January 24, 2018
దావోస్: భారత జనాభాలో ఇప్పటికీ 80శాతం మందికి సొంత వాహనాలు లేవని, అలాంటివారికి తొలి వాహనం ఎలక్ట్రిక్ వాహనం కావాలిని తాము కోరుకుంటున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదసుసలో డిజైనింగ్ ఫర్ స్మార్ట్ మొబిలిటీ అంశంపై ఆయన మాట్లాడారు. పాశ్చాత్య దేశాల్లో ప్రతి ఒక్కరికీ సొంత వాహనం ఉంటుంది. భారత్ వంటి దేశాల్లో ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో వృద్ధి కనిపిస్తోంది. భారత జానాభాలో ఇప్పటికీ 80శాతం మందికి సొంత వాహనాలు లేవు. అలాంటివారి తొలి వాహనం ఎలక్ట్రిక్ వాహనం కావాలని కోరుకుంటున్నాం అని గోయల్ తెలిపారు. దేశంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగం శరవేగంగా వృద్ధి చెందుతోందని చెప్పారు. సౌరవిద్యుత వినియోగంలో గత 3.5ఐదేళ్లలో 6 రెట్ల వృద్ధిని సాధించామని, 2022 నాటికి 10 గిగావాట్ల ఉత్పత్తిని అందుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. దేశంలో ఎల్ఇడి బల్బులను వినియోగంలోకి తెచ్చేందుకు 2015లో పెద్దఎత్తున ప్రచారం చేపట్టామని, 800మిలియన్ బల్బులను వినియోగంలోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఎల్పీజీ ఉండాలన్న ఉద్దేశంతో గత మూడేళ్లలో 3.5లక్షల కనెక్షన్లను అందుజేశామని తెలిపారు.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!







