తొలి వాహనం ఎలక్ట్రిక్ కావాలి: పీయూష్ గోయల్
- January 24, 2018
దావోస్: భారత జనాభాలో ఇప్పటికీ 80శాతం మందికి సొంత వాహనాలు లేవని, అలాంటివారికి తొలి వాహనం ఎలక్ట్రిక్ వాహనం కావాలిని తాము కోరుకుంటున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదసుసలో డిజైనింగ్ ఫర్ స్మార్ట్ మొబిలిటీ అంశంపై ఆయన మాట్లాడారు. పాశ్చాత్య దేశాల్లో ప్రతి ఒక్కరికీ సొంత వాహనం ఉంటుంది. భారత్ వంటి దేశాల్లో ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో వృద్ధి కనిపిస్తోంది. భారత జానాభాలో ఇప్పటికీ 80శాతం మందికి సొంత వాహనాలు లేవు. అలాంటివారి తొలి వాహనం ఎలక్ట్రిక్ వాహనం కావాలని కోరుకుంటున్నాం అని గోయల్ తెలిపారు. దేశంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగం శరవేగంగా వృద్ధి చెందుతోందని చెప్పారు. సౌరవిద్యుత వినియోగంలో గత 3.5ఐదేళ్లలో 6 రెట్ల వృద్ధిని సాధించామని, 2022 నాటికి 10 గిగావాట్ల ఉత్పత్తిని అందుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. దేశంలో ఎల్ఇడి బల్బులను వినియోగంలోకి తెచ్చేందుకు 2015లో పెద్దఎత్తున ప్రచారం చేపట్టామని, 800మిలియన్ బల్బులను వినియోగంలోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఎల్పీజీ ఉండాలన్న ఉద్దేశంతో గత మూడేళ్లలో 3.5లక్షల కనెక్షన్లను అందుజేశామని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







