'రాహుల్‌ ఏ రాష్ట్రానికి వెళ్లి పోటీ చేయమన్నా నేను రెడీ' : విజయశాంతి

- January 25, 2018 , by Maagulf
'రాహుల్‌ ఏ రాష్ట్రానికి వెళ్లి పోటీ చేయమన్నా నేను రెడీ' : విజయశాంతి

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదేశాల ప్రకారం పనిచేస్తానని విజయశాంతి అన్నారు. తెలంగాణలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేపట్టిన పర్యటనను ఉద్దేశించి రాష్ట్రంలో పవనే కాదు ఎవరైనా పర్యటన చేసుకోవచ్చని చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత క్రియాశాల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి నేటికి 20 ఏళ్లు అవుతుందన్నారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయాలని లేదని, అయితే రాహుల్‌ గాంధీ తనను ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నారని ఆమె చెప్పారు. ఆయన ఏ రాష్ట్రానికి వెళ్లి పోటీ చేయమన్నా నేను రెడీ అని అన్నారు. కెసిఆర్‌ పాలన బాగలేదనే ఫీడ్‌బ్యాక్‌ ఉందని అన్నారు. ఉద్యమం నాటి కెసిఆర్‌ వేరు ఇప్పటి కెసిఆర్‌ వేరు అని చెప్పారు. మీడియాకు ఫ్రీడం లేకుండా చేశారని, కోదండరామ్‌ను మాట్లాడకుండా చేస్తున్నారని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com