'రాహుల్ ఏ రాష్ట్రానికి వెళ్లి పోటీ చేయమన్నా నేను రెడీ' : విజయశాంతి
- January 25, 2018
హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారం పనిచేస్తానని విజయశాంతి అన్నారు. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పర్యటనను ఉద్దేశించి రాష్ట్రంలో పవనే కాదు ఎవరైనా పర్యటన చేసుకోవచ్చని చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత క్రియాశాల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి నేటికి 20 ఏళ్లు అవుతుందన్నారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయాలని లేదని, అయితే రాహుల్ గాంధీ తనను ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నారని ఆమె చెప్పారు. ఆయన ఏ రాష్ట్రానికి వెళ్లి పోటీ చేయమన్నా నేను రెడీ అని అన్నారు. కెసిఆర్ పాలన బాగలేదనే ఫీడ్బ్యాక్ ఉందని అన్నారు. ఉద్యమం నాటి కెసిఆర్ వేరు ఇప్పటి కెసిఆర్ వేరు అని చెప్పారు. మీడియాకు ఫ్రీడం లేకుండా చేశారని, కోదండరామ్ను మాట్లాడకుండా చేస్తున్నారని అన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







