వినూత్న శైలిలో నిరసన తెలిపిన భారత జవాన్లు
- January 26, 2018
అట్టారిః పాకిస్థాన్ సైనికులకు తమదైన శైలిలో నిరసన తెలిపారు బీఎస్ఎఫ్ జవానులు. రిపబ్లిక్ డే సందర్భంగా స్వీట్లు పంచుకోవడానికి నిరాకరించారు. సరిహద్దుల్లో పాక్ తీరుపై ఆగ్రహంగా ఉన్న జవాన్లు.. ఈ విధంగా నిరసన తెలిపారు. ముఖ్యమైన పండుగలు, జాతీయ దినోత్సాల సందర్భంగా బోర్డర్లో స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పాకిస్థాన్ సైనికులకు భారత జవానులు ఇస్తే. వాళ్లు వీళ్లకి ఇస్తారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ సంప్రదాయాన్ని శుక్రవారం బ్రేక్ చేశారు బీఎస్ఎఫ్ జవాన్లు. గురువారమే ఈ విషయాన్ని పాక్ రేంజర్లకు తెలిపారు. రిపబ్లిక్ డే రోజున ఎలాంటి కార్యక్రమాలు ఉండవని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించడాన్ని నిరసిస్తూ.. వాళ్లకు ఓ బలమైన సందేశాన్ని ఇచ్చేందుకే ఇలా చేశామన్నారు బీఎస్ఎఫ్ సైనికాధికారి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







