వినూత్న శైలిలో నిరసన తెలిపిన భారత జవాన్లు
- January 26, 2018
అట్టారిః పాకిస్థాన్ సైనికులకు తమదైన శైలిలో నిరసన తెలిపారు బీఎస్ఎఫ్ జవానులు. రిపబ్లిక్ డే సందర్భంగా స్వీట్లు పంచుకోవడానికి నిరాకరించారు. సరిహద్దుల్లో పాక్ తీరుపై ఆగ్రహంగా ఉన్న జవాన్లు.. ఈ విధంగా నిరసన తెలిపారు. ముఖ్యమైన పండుగలు, జాతీయ దినోత్సాల సందర్భంగా బోర్డర్లో స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పాకిస్థాన్ సైనికులకు భారత జవానులు ఇస్తే. వాళ్లు వీళ్లకి ఇస్తారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ సంప్రదాయాన్ని శుక్రవారం బ్రేక్ చేశారు బీఎస్ఎఫ్ జవాన్లు. గురువారమే ఈ విషయాన్ని పాక్ రేంజర్లకు తెలిపారు. రిపబ్లిక్ డే రోజున ఎలాంటి కార్యక్రమాలు ఉండవని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించడాన్ని నిరసిస్తూ.. వాళ్లకు ఓ బలమైన సందేశాన్ని ఇచ్చేందుకే ఇలా చేశామన్నారు బీఎస్ఎఫ్ సైనికాధికారి.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







