పద్మావత్ సినిమాపై రాష్ట్రపతి వ్యాఖ్యలు
- January 26, 2018
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రిపబ్లిక్ డే ప్రసంగంలో విలువలతో కూడిన అభివృద్ధిని ఆకాంక్షించారు. పొరుగువారి అభిప్రాయాలకూ, హక్కులకూ, వ్యక్తిగత గోప్యతకూ విలువివ్వాలని కోరారు. పండుగలు చేసుకున్నా, నిరసనలు చేపట్టినా ఇతరులకు అసౌకర్యం కల్గించరాదంటూ పద్మావత్ సినిమా నిరసనలపై పరోక్షంగా కామెంట్ చేశారు. విభేదాలను హుందాగా వ్యక్తపరచాలన్నారు. 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దళిత రాష్ట్రపతుల్లో రెండోవారైన రామ్ నాథ్ కోవింద్ తొలి రిపబ్లిక్ డే ప్రసంగమిది. సుప్రీంకోర్టు వివాదాన్ని కూడా రాష్ట్రపతి పరోక్షంగా ప్రస్తావించారు.
వ్యక్తుల కన్నా వ్యవస్థ పెద్దది.. తాము పనిచేసే వ్యవస్థ ఔన్నత్యాన్ని నిలబెట్టేట్లు అందులో పనిచేసేవారు కృషి చేయాలని కోరారు. 21 వ శతాబ్ది అవసరాలకు అనుగుణంగా డిజిటల్ ఆర్థికవ్యవస్థను, ఆటోమేషన్, రోబోటిక్స్, జినోమిక్స్.. మొదలైనవాటి సాకారం కోసం కదలాలని పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలన అతివేగంగా జరగాలని ఆకాంక్షించారు.
ఇందుకోసం లాభాలు, అధికారాలు వదులుకొని దాతృత్వ స్ఫూర్తిని అవలంభించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







