పద్మావత్ సినిమాపై రాష్ట్రపతి వ్యాఖ్యలు
- January 26, 2018
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రిపబ్లిక్ డే ప్రసంగంలో విలువలతో కూడిన అభివృద్ధిని ఆకాంక్షించారు. పొరుగువారి అభిప్రాయాలకూ, హక్కులకూ, వ్యక్తిగత గోప్యతకూ విలువివ్వాలని కోరారు. పండుగలు చేసుకున్నా, నిరసనలు చేపట్టినా ఇతరులకు అసౌకర్యం కల్గించరాదంటూ పద్మావత్ సినిమా నిరసనలపై పరోక్షంగా కామెంట్ చేశారు. విభేదాలను హుందాగా వ్యక్తపరచాలన్నారు. 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దళిత రాష్ట్రపతుల్లో రెండోవారైన రామ్ నాథ్ కోవింద్ తొలి రిపబ్లిక్ డే ప్రసంగమిది. సుప్రీంకోర్టు వివాదాన్ని కూడా రాష్ట్రపతి పరోక్షంగా ప్రస్తావించారు.
వ్యక్తుల కన్నా వ్యవస్థ పెద్దది.. తాము పనిచేసే వ్యవస్థ ఔన్నత్యాన్ని నిలబెట్టేట్లు అందులో పనిచేసేవారు కృషి చేయాలని కోరారు. 21 వ శతాబ్ది అవసరాలకు అనుగుణంగా డిజిటల్ ఆర్థికవ్యవస్థను, ఆటోమేషన్, రోబోటిక్స్, జినోమిక్స్.. మొదలైనవాటి సాకారం కోసం కదలాలని పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలన అతివేగంగా జరగాలని ఆకాంక్షించారు.
ఇందుకోసం లాభాలు, అధికారాలు వదులుకొని దాతృత్వ స్ఫూర్తిని అవలంభించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!
- ఫిఫా వరల్డ్ కప్ సెమీస్లో ఫ్రాన్స్ పై స్పెయిన్ ఘన విజయం
- 77వ వసంతంలోకి అడుగుపెట్టిన దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్
- సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!







