నాగ శౌర్య లో నన్ను నేను చూసుకున్నా..చిరంజీవి
- January 26, 2018
నాగ శౌర్య హీరోగా తొలిసారిగా వెంకీ కుడుముల దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అవుతున్న సినిమా ఛలో.. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ... తాను ఏ పరిచయం లేని నాగశౌర్య ఫంక్షన్ కు చిరంజీవి వచ్చాడు ఏమిటి అనుకుంటున్నారా..? నన్ను కలవాలను నాగశౌర్య రెండు సార్లు మా ఆఫీసుకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో నేను లేను. అనంతరం నన్ను కలవాలని నాగశౌర్య తన తల్లి ఉషగారితో మా ఇంటికొచ్చాడు. మా ఛలో ప్రీ రిలీజ్ వేడుక మీ సమక్షంలో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం అని అడిగితే... నేను వెంటనే అంగీకరించాను. అలా అంగీకరించడానికి కారణం... నేను హీరోగా అడుగు పెట్టిన తొలి రోజుల్లో నా సినిమా శతదినోత్సవ వేడుక్కి నేను అభిమానించే ఓ పెద్ద స్టార్ హీరోను అతిధిగా పిలిచాను. ఆయన నా ఫంక్షన్ కు అతిధిగా వస్తే.. ఉత్సాహం, ప్రోత్సాహం బాగుంటుంది అని భావించాను. కానీ ఆ హీరో బిజీ ఉండి రాలేక పోయారు. ఆ రోజు ఆ ఫంక్షన్ ను తూతూ మంత్రం గా జరుపుకొన్నాం.. ఆ సమయంలో నేను చాలా నిరుత్సాహ పడ్డా... అది గుర్తుకు వచ్చింది.. నాగ శౌర్య లో నన్ను నేను చూసుకున్నా.. నా లాంటి వాళ్ళు వెళ్తే తనకు ఇచ్చే ప్రోత్సాహం.. ఉత్సాహం వేరు అందుకనే ఛలో ప్రీ రిలీజ్ వెడుక్కి వస్తా అని అన్నా.. అని తన జీవితంలో చోటు చేసుకొన్న సంఘటన ను ఈ వేడుకలో గుర్తు చేసుకొన్నారు.
తాజా వార్తలు
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!







