నాగ శౌర్య లో నన్ను నేను చూసుకున్నా..చిరంజీవి
- January 26, 2018
నాగ శౌర్య హీరోగా తొలిసారిగా వెంకీ కుడుముల దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అవుతున్న సినిమా ఛలో.. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ... తాను ఏ పరిచయం లేని నాగశౌర్య ఫంక్షన్ కు చిరంజీవి వచ్చాడు ఏమిటి అనుకుంటున్నారా..? నన్ను కలవాలను నాగశౌర్య రెండు సార్లు మా ఆఫీసుకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో నేను లేను. అనంతరం నన్ను కలవాలని నాగశౌర్య తన తల్లి ఉషగారితో మా ఇంటికొచ్చాడు. మా ఛలో ప్రీ రిలీజ్ వేడుక మీ సమక్షంలో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం అని అడిగితే... నేను వెంటనే అంగీకరించాను. అలా అంగీకరించడానికి కారణం... నేను హీరోగా అడుగు పెట్టిన తొలి రోజుల్లో నా సినిమా శతదినోత్సవ వేడుక్కి నేను అభిమానించే ఓ పెద్ద స్టార్ హీరోను అతిధిగా పిలిచాను. ఆయన నా ఫంక్షన్ కు అతిధిగా వస్తే.. ఉత్సాహం, ప్రోత్సాహం బాగుంటుంది అని భావించాను. కానీ ఆ హీరో బిజీ ఉండి రాలేక పోయారు. ఆ రోజు ఆ ఫంక్షన్ ను తూతూ మంత్రం గా జరుపుకొన్నాం.. ఆ సమయంలో నేను చాలా నిరుత్సాహ పడ్డా... అది గుర్తుకు వచ్చింది.. నాగ శౌర్య లో నన్ను నేను చూసుకున్నా.. నా లాంటి వాళ్ళు వెళ్తే తనకు ఇచ్చే ప్రోత్సాహం.. ఉత్సాహం వేరు అందుకనే ఛలో ప్రీ రిలీజ్ వెడుక్కి వస్తా అని అన్నా.. అని తన జీవితంలో చోటు చేసుకొన్న సంఘటన ను ఈ వేడుకలో గుర్తు చేసుకొన్నారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!