ఎయిర్పోర్టులో పిల్లలు జాగ్రత్త
- January 26, 2018
దుబాయ్: గత ఏడాది దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రయాణీకుల సంఖ్య 91.2 మిలియన్లు. ఇంత పెద్దయెత్తున ప్రయాణీకులు ఈ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం, ఈ విమానాశ్రయం ద్వారా దేశంలోకి రావడం జరుగుతోందనీ, ఈ క్రమంలో ప్రయాణీకులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసులు సూచించారు. ఇటవలే దుబాయ్కి వచ్చిన ఓ కుటుంబం, తమ చిన్నారిని విమానాశ్రయంలో మర్చిపోయింది. విమానాశ్రయ సిబ్బంది, ఆ చిన్నారిని గమనించి, ఎయిర్పోర్ట్ నుంచి అల్ అయిన్లోని తమ ఇంటికి వెళ్ళిపోయిన ఆ కుటటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. టెక్నాలజీ సాయంతో చిన్నారి తల్లిదండ్రుల్ని గుర్తించగలిగారు. దుబాయ్ పోలీస్ - ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలి అతిక్ బిన్ లహెజ్ మాట్లాడుతూ, చిన్నారి తప్పిపోయిన సమాచారాన్ని తల్లిదండ్రులకు తాము చేరవేశామనీ, అప్పటికీ వారు చిన్నారి తప్పిపోయిన విషయం గుర్తించలేకపోయారని అన్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయనీ, కుటుంబ సభ్యులు చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉంటే సమస్యలు తలెత్తవని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ







