ఎయిర్పోర్టులో పిల్లలు జాగ్రత్త
- January 26, 2018
దుబాయ్: గత ఏడాది దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రయాణీకుల సంఖ్య 91.2 మిలియన్లు. ఇంత పెద్దయెత్తున ప్రయాణీకులు ఈ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం, ఈ విమానాశ్రయం ద్వారా దేశంలోకి రావడం జరుగుతోందనీ, ఈ క్రమంలో ప్రయాణీకులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసులు సూచించారు. ఇటవలే దుబాయ్కి వచ్చిన ఓ కుటుంబం, తమ చిన్నారిని విమానాశ్రయంలో మర్చిపోయింది. విమానాశ్రయ సిబ్బంది, ఆ చిన్నారిని గమనించి, ఎయిర్పోర్ట్ నుంచి అల్ అయిన్లోని తమ ఇంటికి వెళ్ళిపోయిన ఆ కుటటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. టెక్నాలజీ సాయంతో చిన్నారి తల్లిదండ్రుల్ని గుర్తించగలిగారు. దుబాయ్ పోలీస్ - ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలి అతిక్ బిన్ లహెజ్ మాట్లాడుతూ, చిన్నారి తప్పిపోయిన సమాచారాన్ని తల్లిదండ్రులకు తాము చేరవేశామనీ, అప్పటికీ వారు చిన్నారి తప్పిపోయిన విషయం గుర్తించలేకపోయారని అన్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయనీ, కుటుంబ సభ్యులు చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉంటే సమస్యలు తలెత్తవని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు