సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న సీఎం కేసిఆర్
- January 26, 2018
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా ఇతరులను దూషించడం మరీ ఎక్కువైపోయింది. అయితే ఇకనుంచి ఏమాత్రం ఆలా చేశారా.. జైలు ఊచలు లెక్కబెడతారు. తాజాగా దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సంతకం కూడా చేశారు. సోషల్ మీడియా ద్వారా సభ్యత మరిచి ఇతరులను దూషించిన, కించపరిచినా జైలుకు వెళ్లాల్సిందే! కేసు నమోదు చేయడానికి కోర్టు అనుమతి తీసుకోవడం వంటి సంప్రదాయాలేమీ పాటించనక్కర్లేదు. పిర్యాదు అందిన వెంటనే పోలీసులు సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు.
ఈ మేరకు ఐపీసీ చట్టంలోని సెక్షన్లు 506, 507 కింద పేర్కొన్న నేరాలను కోర్టు అనుమతి లేకుండానే (కాగ్నిజబుల్) విచారించదగినవిగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. కాగాఈ ఫైలుపై నిన్న(గురువారం) రాత్రి సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఇకనుంచి ఎవరైనా సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు దిగితేన వారు ఈ చట్ట ప్రకారం శిక్షార్హులు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు పెడతామని, ఈ మేరకు చట్టం తీసుకొస్తామని సీఎం గతంలో అనేకసార్లు హెచ్చరించారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక