సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న సీఎం కేసిఆర్
- January 26, 2018
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా ఇతరులను దూషించడం మరీ ఎక్కువైపోయింది. అయితే ఇకనుంచి ఏమాత్రం ఆలా చేశారా.. జైలు ఊచలు లెక్కబెడతారు. తాజాగా దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సంతకం కూడా చేశారు. సోషల్ మీడియా ద్వారా సభ్యత మరిచి ఇతరులను దూషించిన, కించపరిచినా జైలుకు వెళ్లాల్సిందే! కేసు నమోదు చేయడానికి కోర్టు అనుమతి తీసుకోవడం వంటి సంప్రదాయాలేమీ పాటించనక్కర్లేదు. పిర్యాదు అందిన వెంటనే పోలీసులు సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు.
ఈ మేరకు ఐపీసీ చట్టంలోని సెక్షన్లు 506, 507 కింద పేర్కొన్న నేరాలను కోర్టు అనుమతి లేకుండానే (కాగ్నిజబుల్) విచారించదగినవిగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. కాగాఈ ఫైలుపై నిన్న(గురువారం) రాత్రి సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఇకనుంచి ఎవరైనా సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు దిగితేన వారు ఈ చట్ట ప్రకారం శిక్షార్హులు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు పెడతామని, ఈ మేరకు చట్టం తీసుకొస్తామని సీఎం గతంలో అనేకసార్లు హెచ్చరించారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







