హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. చలిగాలుల కారణంగా తెలంగాణ, ఏపీలో రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీం జిల్లాలో అత్యల్పంగా 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరోవైపు చలితీవ్రతతో రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయమే బయటకు వచ్చేందుకు చలికి వణికిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు.