సన్రైజర్స్ కొత్త టీం
- January 29, 2018
హైదరాబాద్: ఐపీఎల్ పదకొండో సీజన్కు అతి కీలకమైన ఘట్టం ముగిసింది. మ్యాచ్లకు మించిన ఉత్కంఠ రేపుతూ.. రెండు రోజుల పాటు సాగిన ఆటగాళ్ల వేలం విజయవంతంగా పూర్తయింది. మెగా లీగ్లో తమ సైనికులను ఎంచుకున్న జట్లు కొత్త రూపును సంతరించుకొని రెండో దశాబ్దంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాయి.
ఐపీఎల్లో 2012 నుంచి సన్రైజర్స్ ఎక్కువగా బౌలర్లపైనే దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. ఐపీఎల్లో బౌలింగ్ నైపుణ్యంతో తనదైన ముద్రవేసిన జట్టుగా సన్రైజర్స్కు గుర్తింపు ఉంది. అంతేకాక 2016లో ఛాంపియన్గా కూడా నిలిచింది. తాజాగా ఐపీఎల్ వేలం పాటలోనూ బౌలర్లనే నమ్ముకుంది ఆ జట్టు. సత్తా ఉన్న ఆటగాళ్ళపైనే దృష్టిసారించిన సన్రైజర్స్.. అనుకున్న ఆటగాళ్ళను ఎంపిక చేసుకోవడంలో సఫలమైందని చెప్పవచ్చు.
సన్రైజర్స్ పెట్టిన ఖర్చు: రూ.79.35 కోట్లు
జట్టు వద్ద మిగిలిన డబ్బు: రూ.65 లక్షలు
రీటెయిన్డ్: డేవిడ్ వార్నర్ (రూ.12.5 కోట్లు), భువనేశ్వర్ (రూ.8.5 కోట్లు)
రైట్ టు మ్యాచ్: రషీద్ఖాన్ (రూ.9 కోట్లు), శిఖర్ ధావన్ (రూ.5.2 కోట్లు), దీపక్ హుడా (రూ.3.6 కోట్లు)
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు
వార్నర్ (12.5 కోట్లు), మనీష్ పాండే (11 కోట్లు), రషీద్ (9), భువనేశ్వర్ (8.5),
ధవన్ (5.2), సాహా (5), సిద్ధార్ధ్ కౌల్ (3.8), దీపక్ హుడా (3.6),
ఖలీల్ అహ్మద్ (3), సందీప్ శర్మ (3), కేన్ విలియమ్సన్ (3), బ్రాత్వైట్ (2),
షకీబల్ (2), యూసుఫ్ (1.9), శ్రీవత్స గోస్వామి (1), నబీ (1), జోర్డాన్ (1),
బాసిల్ థంపి (0.95 లక్షలు), స్టాన్లేక్ (0.50), టి.నటరాజన్ (0.40),
సచిన్ బేబి (0.20), బిపుల్ శర్మ (0.20) మెహ్ది హసన్ (20),
రికీ భుయ్ (0.20), తన్మయ్ అగర్వాల్ (0.20).
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







