సోషల్ మీడియా కమ్యూనికేషన్ హబ్ ప్రారంభం త్వరలో
- January 29, 2018
*కేంద్ర సమాచార, ప్రసార శాఖ
అమరావతి : కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకాల అమలు, జిల్లాలో ట్రెండింగ్ సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా 'సోషల్ మీడియా కమ్యూనికేషన్ హబ్'ను ప్రారంభించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సమాచార సేకరణకు ప్రతి జిల్లాలో మీడియా ప్రతినిధుల్ని కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తామని వెల్లడించింది. వీరు ఆయా జిల్లాల్లో జరిగే సంఘటనలతో పాటు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారని పేర్కొంది. ఈ సమాచారాన్ని విశ్లేషించడానికి కేంద్ర స్థాయిలో నిపుణుల్ని నియమిస్తామంది. ఈ ప్రాజెక్టు ఇంగ్లిష్, హిందీ, తెలుగు, బెంగాలి, తమిళ్, కన్నడ సహా పలు భాషల్ని సపోర్ట్ చేస్తుందనీ.. దీంతో అన్ని సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మీడియాల్లోని సమాచారాన్ని సేకరించవచ్చంది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







