సోషల్ మీడియా కమ్యూనికేషన్ హబ్ ప్రారంభం త్వరలో
- January 29, 2018
*కేంద్ర సమాచార, ప్రసార శాఖ
అమరావతి : కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకాల అమలు, జిల్లాలో ట్రెండింగ్ సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా 'సోషల్ మీడియా కమ్యూనికేషన్ హబ్'ను ప్రారంభించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సమాచార సేకరణకు ప్రతి జిల్లాలో మీడియా ప్రతినిధుల్ని కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తామని వెల్లడించింది. వీరు ఆయా జిల్లాల్లో జరిగే సంఘటనలతో పాటు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారని పేర్కొంది. ఈ సమాచారాన్ని విశ్లేషించడానికి కేంద్ర స్థాయిలో నిపుణుల్ని నియమిస్తామంది. ఈ ప్రాజెక్టు ఇంగ్లిష్, హిందీ, తెలుగు, బెంగాలి, తమిళ్, కన్నడ సహా పలు భాషల్ని సపోర్ట్ చేస్తుందనీ.. దీంతో అన్ని సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మీడియాల్లోని సమాచారాన్ని సేకరించవచ్చంది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









