దోహా మెట్రో పనుల కోసం రెండు రహదారులు మూసివేత
- January 31, 2018
కతర్ : రేపు శుక్రవారం (ఫిబ్రవరి 2 వ తేదీ)నుంచి దోహా మెట్రో పనుల నిర్వహించేందుకు అల్ బిదా వీధి మరియు అల్ డివాన్ స్ట్రీట్ రెండు రోడ్లను మూసివేస్తామని కతర్ రైలు ప్రకటించింది. ఖలీఫా స్ట్రీట్ తూర్పు సరిహద్దులో అదే రోజున మరో రహదారిని పునరుద్ధించనుంది. దోహా మెట్రో ప్రాజెక్టు కారణంగా మూసివేయబడింది. అందుకు బదులుగా డివెర్షన్స్ (వైవిధ్యాలు) ఉంటాయి. నాసర్ బిన్ ఖలీద్ మరియు అల్ డివాన్ స్ట్రీట్ మధ్య యొక్క భాగం ఎలక్ట్రిసిటీ విభజన మరియు మిషీర్బ్ స్టేషన్ యొక్క పశ్చిమ ద్వారం నిర్మాణం కారణంగా ఫిబ్రవరి 2 వ తేదీ 2018 నుంచి మార్చి15 వ తేదీ 2018 నుండి మళ్ళించబడుతుంది. అదేవిధంగా డివెర్షన్స్ మ్యాప్ ప్రకారం అల్ బిదా వీధికి సౌత్ బౌండ్ రహదారి మరియు ఆల్ బిదార స్ట్రీట్ సౌత్ తో పాటు అల్ బిదా స్ట్రీట్ సౌత్ బౌండ్ పునర్నిర్మాణ వాస్తవ రైలు మార్గం పూర్తిచేసేందుకు సైతం ఫిబ్రవరి 2 వ తేదీ 2018 నుండి ఫిబ్రవరి 23 వ తేదీ 2018 మధ్యకాలంలో మూసివేయబడుతుంది. పై చిత్రంలో చూపించిన మాదిరిగా రహదారి యొక్క మార్గాలు చూపించబడినట్లుగా ఇది కార్నికే స్టేషన్ మధ్య పాదచారుల అండర్ పాస్ మరియు ఖలీఫా ఇంటర్నేషనల్ టెన్నిస్ , స్క్వాష్ కాంప్లెక్స్ నిర్మాణం నిమిత్తం మూసివేయబడింది. రహదారి వినియోగదారులు అందరూ వేగ పరిమితితో ప్రయాణించడానికి కట్టుబడి ఉంచడానికి వారికి భద్రతను కల్పించడానికి తాము ఏర్పాటుచేసిన రహదారి మళ్లింపు చిహ్నాలను అనుసరించండని కతర్ రైలు సూచన చేసింది.
తాజా వార్తలు
- ట్రంప్ వాదనల మధ్య కొనసాగుతున్న ఇరాన్ దాడులు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి









