దోహా మెట్రో పనుల కోసం రెండు రహదారులు మూసివేత
- January 31, 2018
కతర్ : రేపు శుక్రవారం (ఫిబ్రవరి 2 వ తేదీ)నుంచి దోహా మెట్రో పనుల నిర్వహించేందుకు అల్ బిదా వీధి మరియు అల్ డివాన్ స్ట్రీట్ రెండు రోడ్లను మూసివేస్తామని కతర్ రైలు ప్రకటించింది. ఖలీఫా స్ట్రీట్ తూర్పు సరిహద్దులో అదే రోజున మరో రహదారిని పునరుద్ధించనుంది. దోహా మెట్రో ప్రాజెక్టు కారణంగా మూసివేయబడింది. అందుకు బదులుగా డివెర్షన్స్ (వైవిధ్యాలు) ఉంటాయి. నాసర్ బిన్ ఖలీద్ మరియు అల్ డివాన్ స్ట్రీట్ మధ్య యొక్క భాగం ఎలక్ట్రిసిటీ విభజన మరియు మిషీర్బ్ స్టేషన్ యొక్క పశ్చిమ ద్వారం నిర్మాణం కారణంగా ఫిబ్రవరి 2 వ తేదీ 2018 నుంచి మార్చి15 వ తేదీ 2018 నుండి మళ్ళించబడుతుంది. అదేవిధంగా డివెర్షన్స్ మ్యాప్ ప్రకారం అల్ బిదా వీధికి సౌత్ బౌండ్ రహదారి మరియు ఆల్ బిదార స్ట్రీట్ సౌత్ తో పాటు అల్ బిదా స్ట్రీట్ సౌత్ బౌండ్ పునర్నిర్మాణ వాస్తవ రైలు మార్గం పూర్తిచేసేందుకు సైతం ఫిబ్రవరి 2 వ తేదీ 2018 నుండి ఫిబ్రవరి 23 వ తేదీ 2018 మధ్యకాలంలో మూసివేయబడుతుంది. పై చిత్రంలో చూపించిన మాదిరిగా రహదారి యొక్క మార్గాలు చూపించబడినట్లుగా ఇది కార్నికే స్టేషన్ మధ్య పాదచారుల అండర్ పాస్ మరియు ఖలీఫా ఇంటర్నేషనల్ టెన్నిస్ , స్క్వాష్ కాంప్లెక్స్ నిర్మాణం నిమిత్తం మూసివేయబడింది. రహదారి వినియోగదారులు అందరూ వేగ పరిమితితో ప్రయాణించడానికి కట్టుబడి ఉంచడానికి వారికి భద్రతను కల్పించడానికి తాము ఏర్పాటుచేసిన రహదారి మళ్లింపు చిహ్నాలను అనుసరించండని కతర్ రైలు సూచన చేసింది.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









