ఎమిరేట్స్లో ఫిబ్రవరి కాస్తంత చల్లగానే ఉండొచ్చు: ఎన్సీఎం
- February 02, 2018
ఏషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం), ఫిబ్రవరిలో సరాసరి ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి సెకెండాఫ్లో మాత్రం కొంత మేర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కలనిపించవచ్చు. అది కూడా మౌంటెయిన్ ఏరియాస్లో ఉండొచ్చని ఎన్సిఎం స్పష్టతనిచ్చింది. దేశం కొంతమేర లో ప్రెజర్ని చూసే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో సరాసరి అత్యధిక ఉష్ణోగ్రతలు 23 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కావొచ్చు. అత్యల్ప ఉష్ణోగ్రతలు 12.3 నుంచి 16.1 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. ఫిబ్రవరిలో ఇప్పటిదాకా అత్యధిక ఉష్ణోగ్రత అంటే 2009లో నమోదైన 39.8 డిగ్రీలే. యూఏఈ వెస్ట్ బోర్డర్లో ఈ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్ప ఉష్ణోగ్రత 5.7 డిగ్రీలు 2017లో నమోదయ్యింది. జబెల్ జైస్లో ఈ ఉష్ణోగ్రత నమోదయ్యింది. హ్యుమిడిటీ యావరేజ్ మాగ్జిమమ్ ఫిబ్రవరిలో 78 నుంచి 88 వరకు ఉండొచ్చు. అత్యల్ప హ్యుమిడిటీ 29 నుంచి 40 శాతం నమోదయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









