మిస్ పాపులర్ టైటిల్ వేటలో తెలుగమ్మాయ్ రీతూ రావ్
- February 02, 2018
ముంబై:మిస్ అండ్ మిసెస్ తియారా ఇండియా 2018 పోటీల్లో 19 ఏళ్ళ తెలుగమ్మాయి రీతూరావు 'మిస్ పాపులర్' కేటగిరీ కోసం బరిలో నిలిచింది. లోనావాలో ప్రస్తుతం పోటీల కోసం సన్నద్ధమవుతోంది రీతూ రావు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న రీతూ రావు, ఈ పోటీల కోసం తనకు తెలుగువారందరి మద్దతు కావాలని కోరుతోంది. ఫిబ్రవరి 6న ముంబైలోని మహాకవి కాలిదాస్ ఆడిటోరియంలో ఈ పోటీలు జరుగుతాయి. బాలీవుడ్ నటుడు, నిర్మాత, డైరెక్టర్ అర్భాజ్ ఖాన్, మోడల్ ఆర్యన్, బాలీవుడ్ సింగర్ షిబానీ కశ్యప్ ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. రీతూ రావు తండ్రి, ఓ ఎంఎన్సీ కంపెనీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె తల్లి సుజాతారావు ఎంటర్ప్రెన్యూర్. కళా నిలయం పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారామె. రితూ రావ్ సోదరి రిహా రావ్ 10వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు రీతూ రావ్ అందాల పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.


తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









