అనుష్కని ప్రశంసలతో ముంచెత్తిన రజని
- February 03, 2018
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'భాగమతి'. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. జి. అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. హర్రర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. చిత్రం తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.12 కోట్లు వసూలు చేసింది.
ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు అనుష్కపై ప్రశంసల జల్లు కురిపించారు. 'భాగమతి' సినిమా చూసిన తర్వాత తన భార్య ఉపాసనకు నిద్రపట్టలేదని రామ్చరణ్ ఫేస్బుక్ వేదికగా పేర్కొన్నారు. కాగా, అనుష్క తాజాగా ఓ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 'ఇప్పటి వరకు మీకు అందిన ప్రశంసల్లో ఉత్తమమైనది ఏది?' అని అడిగిన విలేకరి ప్రశ్నకు బదులిచ్చారు.
''రజనీకాంత్ ఫోన్ చేశారు.
'భాగమతి' సినిమా చాలా నచ్చింది అన్నారు. మనం ఓ సినిమా చేయడం.. సూపర్స్టార్ ఫోన్ చేసి అలా అభినందించడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, నా స్నేహితులు కూడా శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు పంపారు'' అంటూ ఆనందం వ్యక్తంచేశారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









