అనుష్కని ప్రశంసలతో ముంచెత్తిన రజని
- February 03, 2018
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'భాగమతి'. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. జి. అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. హర్రర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. చిత్రం తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.12 కోట్లు వసూలు చేసింది.
ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు అనుష్కపై ప్రశంసల జల్లు కురిపించారు. 'భాగమతి' సినిమా చూసిన తర్వాత తన భార్య ఉపాసనకు నిద్రపట్టలేదని రామ్చరణ్ ఫేస్బుక్ వేదికగా పేర్కొన్నారు. కాగా, అనుష్క తాజాగా ఓ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 'ఇప్పటి వరకు మీకు అందిన ప్రశంసల్లో ఉత్తమమైనది ఏది?' అని అడిగిన విలేకరి ప్రశ్నకు బదులిచ్చారు.
''రజనీకాంత్ ఫోన్ చేశారు.
'భాగమతి' సినిమా చాలా నచ్చింది అన్నారు. మనం ఓ సినిమా చేయడం.. సూపర్స్టార్ ఫోన్ చేసి అలా అభినందించడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, నా స్నేహితులు కూడా శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు పంపారు'' అంటూ ఆనందం వ్యక్తంచేశారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







