యూఏఈ తయారీ శాటిలైట్ని పరిశీలించిన షేక్ మొహమ్మద్
- February 03, 2018
వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రసీద్ అల్ మక్తౌమ్, ఖలీఫా శాట్ ప్రాజెక్ట్ని పరిశీలించారు. మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్సెంటర్లో ఈ శాటిలైట్ని ఆయన పరిశీలించడం జరిగింది. ఖలీఫా ఎమిరేటీ ఇంజనీర్లు తయారు చేసిన తొలి శాటిలైట్. ఈ ఏడాదిలోనే ఈ శాటిలైట్ని ప్రయోగిస్తారు. అరబ్ ప్రపంచంలో తొలిసారిగా ఈ ఘనత జాధించింది ఎమిరేటీ ఇంజనీర్లేనని షేక్ మొహమ్మద్ చెప్పారు. యూఏఈ సాధించిన ఘనవిజయాల్లో ఇదొకటని ఆయన చెప్పారు. ఎంబిఆర్ఎస్సి ఛైర్మన్ హమాద్ ఒబైద్ అల్ మన్సౌరీ, మేజర్ జనరల్ తలాల్ హమీద్ బెల్హౌల్ అల్ ఫలాసి, ఎంబిఆర్ఎస్సి డైరెక్టర్ జనరల్ యసుఫ్ అల్ షైబాని, షేక్ మొహమ్మద్కి ఆహ్వానం పలికారు. ఈ సెంటర్లో షేక్ మొహమ్మద్ కలియతిరగ్గా, ఆయనకు వివిధ అంశాలపై వివరణ ఇచ్చారు అక్కడి ప్రముఖులు. ఎంబీఆర్ఎస్సి తరఫున ఇది మూడో శాటిలైట్.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







