యూఏఈ తయారీ శాటిలైట్ని పరిశీలించిన షేక్ మొహమ్మద్
- February 03, 2018వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రసీద్ అల్ మక్తౌమ్, ఖలీఫా శాట్ ప్రాజెక్ట్ని పరిశీలించారు. మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్సెంటర్లో ఈ శాటిలైట్ని ఆయన పరిశీలించడం జరిగింది. ఖలీఫా ఎమిరేటీ ఇంజనీర్లు తయారు చేసిన తొలి శాటిలైట్. ఈ ఏడాదిలోనే ఈ శాటిలైట్ని ప్రయోగిస్తారు. అరబ్ ప్రపంచంలో తొలిసారిగా ఈ ఘనత జాధించింది ఎమిరేటీ ఇంజనీర్లేనని షేక్ మొహమ్మద్ చెప్పారు. యూఏఈ సాధించిన ఘనవిజయాల్లో ఇదొకటని ఆయన చెప్పారు. ఎంబిఆర్ఎస్సి ఛైర్మన్ హమాద్ ఒబైద్ అల్ మన్సౌరీ, మేజర్ జనరల్ తలాల్ హమీద్ బెల్హౌల్ అల్ ఫలాసి, ఎంబిఆర్ఎస్సి డైరెక్టర్ జనరల్ యసుఫ్ అల్ షైబాని, షేక్ మొహమ్మద్కి ఆహ్వానం పలికారు. ఈ సెంటర్లో షేక్ మొహమ్మద్ కలియతిరగ్గా, ఆయనకు వివిధ అంశాలపై వివరణ ఇచ్చారు అక్కడి ప్రముఖులు. ఎంబీఆర్ఎస్సి తరఫున ఇది మూడో శాటిలైట్.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ