యూఏఈ తయారీ శాటిలైట్ని పరిశీలించిన షేక్ మొహమ్మద్
- February 03, 2018
వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రసీద్ అల్ మక్తౌమ్, ఖలీఫా శాట్ ప్రాజెక్ట్ని పరిశీలించారు. మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్సెంటర్లో ఈ శాటిలైట్ని ఆయన పరిశీలించడం జరిగింది. ఖలీఫా ఎమిరేటీ ఇంజనీర్లు తయారు చేసిన తొలి శాటిలైట్. ఈ ఏడాదిలోనే ఈ శాటిలైట్ని ప్రయోగిస్తారు. అరబ్ ప్రపంచంలో తొలిసారిగా ఈ ఘనత జాధించింది ఎమిరేటీ ఇంజనీర్లేనని షేక్ మొహమ్మద్ చెప్పారు. యూఏఈ సాధించిన ఘనవిజయాల్లో ఇదొకటని ఆయన చెప్పారు. ఎంబిఆర్ఎస్సి ఛైర్మన్ హమాద్ ఒబైద్ అల్ మన్సౌరీ, మేజర్ జనరల్ తలాల్ హమీద్ బెల్హౌల్ అల్ ఫలాసి, ఎంబిఆర్ఎస్సి డైరెక్టర్ జనరల్ యసుఫ్ అల్ షైబాని, షేక్ మొహమ్మద్కి ఆహ్వానం పలికారు. ఈ సెంటర్లో షేక్ మొహమ్మద్ కలియతిరగ్గా, ఆయనకు వివిధ అంశాలపై వివరణ ఇచ్చారు అక్కడి ప్రముఖులు. ఎంబీఆర్ఎస్సి తరఫున ఇది మూడో శాటిలైట్.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









