మాజీ భార్యను ముక్కలుగా నరికి.. సూట్ కేసు లో పెట్టి..
- February 03, 2018
రోజు రోజుకీ మనిషిలోని మానవత్వం మంచితనం మాయమైపోతున్నాయి. మాజీ భార్యను కోపం పట్టలేక చంపిన.. కేసులో భారత సంతతికి చెందిన అశ్విన్ దౌడియా (51) కు శుక్రవారం లండన్ కోర్టు 18 ఏళ్ళు కఠిన కారాగార శిక్షను విధించింది.
లీచెస్టర్ లో నివాసం ఉంటున్న అశ్విన్ కిరణ్ దంపతులు 2014 లో విడాకులు తీసుకొన్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం.. విడాకులు తీసుకొన్నా.. వీరిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరుగా ఉంటున్నారు. అయితే 2017 లో కిరణ్ దౌడియా (46) ఆన్ లైన్ లో డేటింగ్ సైట్ లో తన వివరాలను ఇచ్చింది. దీంతో అశ్విన్ తన మాజీ భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. పట్టలేని కోపంతో ఆమె పీకను గట్టిగా నొక్కి మెడను విరిచేశాడు. దీంతో కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నది. భార్య శవాన్ని చూసిన అశ్విన్ పోలీసుల నుంచి తప్పించుకొనేందుకు తెలివిగా ఆలోచించి... ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి.. ఓ సూట్ కేసు లో పెట్టాడు. అనంతరం ఆ సూట్ కేసును పట్టుకొని వెళ్ళి ఓ లోయలో పడేసి.. ఏమీ తెలియని అమాయకుడిలా ఇంటికి వచ్చాడు. పిల్లలకు తల్లి ఆఫీస్ కు వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదని చెప్పాడు... పోలీసులకు మిస్సింగ్ కేసు గా ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. అప్పుడు అశ్విన్ ఓ సూట్ కేసును ఎక్కడికో తీసుకొని వెళ్ళడం కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అశ్విన్ ను తమదైన స్టైల్ లో విచారణ చేయగా తన నేరం అంగీకరించాడు.. కానీ తన మాజీ భార్యను కావాలని చంపలేదని చెప్పాడు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







