ఇక మెరుపు వేగంతో రెబల్ స్టార్ ప్రభాస్
- February 04, 2018
ఏడాదికి కనీసం నాలుగైదు చిత్రాలతో తెరపైకి వచ్చేవారు నిన్నటి తరం కథానాయకులు. అయితే ఇప్పటి హీరోలకు అది సాధ్యమవడం లేదు. మంచి కథ, దాన్ని తెరకెక్కించే సాంకేతిక నిపుణులు, పూర్వ నిర్మాణ కార్యక్రమాలతోనే ఏడాది గడిచిపోతోంది. దీంతో వేగంగా సినిమాలు చేయడం ఇప్పటి స్టార్లకు కుదరడం లేదు. అప్పటిలా కేవలం సాంఘిక చిత్రాలు తగ్గిపోవడం, కొత్తగా ఏవైనా కథలు ప్రయత్నించడం ఇప్పటి చిత్రాల రూపకల్పనకు ఎక్కువ సమయాన్నే తీసుకుంటున్నాయి. వీళ్లలో యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ కూడా ఉంటారు. ఆయన చేసేది మంచి ప్రయత్నమే అయినా..కాలహరణమే ఇబ్బంది పెడుతోంది. ఐదేళ్ల బాహుబలి రెండు భాగాల తర్వాత సాహోకు రెండేళ్లు తీసుకుంటున్నారు. అభిమాన కథానాయకుడిని ఏడాదిలో ఒకసారైనా తెరపై చూసుకోవాలనుకునే వాళ్లకు ఇది కష్టమవుతోంది. గొప్ప సినిమా కోసం సర్దుకుపోవాలి అనుకునే అభిమానులూ ఉన్నారు. ఏమైనా తన సినిమాలకు సుదీర్ఘ కాలం పట్టడం ప్రభాస్ కూడా అంతగా ఇష్టపడటం లేదు. ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న ఈ స్టార్..తన తదుపరి చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్లోనే ఉండబోతోంది.
ఈ మరుసటి చిత్రాన్ని మాత్రం అత్యంత వేగంగా పూర్తి చేయాలన్నది ప్రభాస్ ఆలోచన. కేవలం నెలల సమయంలోనే సినిమా తెరకెక్కించి..తెరపైకి తీసుకురావాలని ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







