ఆటో చార్జీల కన్నా విమాన చార్జీలు చౌక అంటున్న సిన్హా
- February 04, 2018
ఇండోర్ : దేశంలో కిలో మీటర్కు ఆటోలో ప్రయాణం కన్నా విమాన ప్రయాణమే చౌకగా మారిందని పౌర విమానాల సహాయక మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. 27వ ఇండోర్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సదస్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్లో విమానాల చార్జీలు, ఆటోరిక్షాల చార్జీల కంటే తక్కువగా ఉన్నాయని, తాను తప్పుగా మాట్లాడటం లేదని, ఇది నిజం అని ప్రసంగించారు. ఇండోర్ నుండి ఢిల్లీకి విమాన ప్రయాణానికి కిలో మీటర్కు రూ.5 ఖర్చు పెడుతున్నారని, అదే ఆటోలో వెళితే కిలోమీటర్కు 5 నుండి 8 రూపాయలను ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు. తక్కువగా చార్జీలు వసూలు చేస్తున్నందున ఎక్కువ మంది విమాన ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు