ఆటో చార్జీల కన్నా విమాన చార్జీలు చౌక అంటున్న సిన్హా
- February 04, 2018
ఇండోర్ : దేశంలో కిలో మీటర్కు ఆటోలో ప్రయాణం కన్నా విమాన ప్రయాణమే చౌకగా మారిందని పౌర విమానాల సహాయక మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. 27వ ఇండోర్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సదస్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్లో విమానాల చార్జీలు, ఆటోరిక్షాల చార్జీల కంటే తక్కువగా ఉన్నాయని, తాను తప్పుగా మాట్లాడటం లేదని, ఇది నిజం అని ప్రసంగించారు. ఇండోర్ నుండి ఢిల్లీకి విమాన ప్రయాణానికి కిలో మీటర్కు రూ.5 ఖర్చు పెడుతున్నారని, అదే ఆటోలో వెళితే కిలోమీటర్కు 5 నుండి 8 రూపాయలను ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు. తక్కువగా చార్జీలు వసూలు చేస్తున్నందున ఎక్కువ మంది విమాన ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







