తిరుగుబాటుదారులపై ప్రతీకారం తీర్చుకుంటాం : టర్కీ ఆర్మీ
- February 04, 2018
అంకారా: సిరియాలో మోహరించిన తమ సైనికులపై మెరుపుదాడికి పాల్పడ్డ కుర్దు తిరుగుబాటుదారులపై ప్రతీకారం తీర్చుకుంటామని టర్కీ పేర్కొన్నది. కుర్దు తిరుగుబాటుదారుల శిబిరాలను ధ్వంసం చేయనున్నట్టు ప్రకటించింది. టర్కీ ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఆఫ్రిన్ నగరానికి సమీపంలో ఉన్న షేక్ హరూజ్ నగరంలో కుర్దు తిరుగుబాటుదారులు ఆదివారం బీభత్సం సృష్టించారు. టర్కీ సైనికుల యుద్ధ ట్యాంక్పై వైమానిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారదు. క్షతగాత్రులను సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై టర్కీ ప్రధాని బినాలీ ఇల్దిరిమ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







