తిరుగుబాటుదారులపై ప్రతీకారం తీర్చుకుంటాం : టర్కీ ఆర్మీ
- February 04, 2018
అంకారా: సిరియాలో మోహరించిన తమ సైనికులపై మెరుపుదాడికి పాల్పడ్డ కుర్దు తిరుగుబాటుదారులపై ప్రతీకారం తీర్చుకుంటామని టర్కీ పేర్కొన్నది. కుర్దు తిరుగుబాటుదారుల శిబిరాలను ధ్వంసం చేయనున్నట్టు ప్రకటించింది. టర్కీ ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఆఫ్రిన్ నగరానికి సమీపంలో ఉన్న షేక్ హరూజ్ నగరంలో కుర్దు తిరుగుబాటుదారులు ఆదివారం బీభత్సం సృష్టించారు. టర్కీ సైనికుల యుద్ధ ట్యాంక్పై వైమానిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారదు. క్షతగాత్రులను సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై టర్కీ ప్రధాని బినాలీ ఇల్దిరిమ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్









