క్రిస్మస్ కానుకగా 'మామ మంచు.. అల్లుడు కంచు'
- November 25, 2015
మోహన్బాబు, అల్లరి నరేష్ హీరోలుగా, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ హీరోయిన్లుగా, శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్పై మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం 'మామ మంచు.. అల్లుడు కంచు' విడుదలకు సిద్ధమైంది. అచ్చు సంగీతమందిస్తున్న ఈ చిత్ర పాటలను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. నాన్నగారు హీరోగా నటించిన 181వ చిత్రమిదని, అలాగే అల్లరి నరేష్కిది 50వ చిత్రం కావడం విశేషమన్నారు. డిఫరెంట్ కాంబినేషన్లో పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యిందన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు దర్శకుడు శ్రీనివాస్రెడ్డి సినిమాను బాగా తెరకెక్కించారన్నారు. అచ్చు అద్భుతమైన మ్యూజిక్ని అందించడం జరిగిందని, నవంబర్ 28న సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియో వేడుకను చాలా గ్రాండ్గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







