ఏపీ విభజన హామీలపై తగ్గేది లేదంటున్న ఏపీ ఎంపీలు..!
- February 07, 2018
పార్లమెంటులో ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీల నిరసనలు కొనసాగనున్నాయి. నిన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉభయ సభల్లో ఏపీ విభజన హామీలపై స్పష్టత ఇచ్చినా.. ప్రధాని హామీ ఇచ్చినా ఎంపీలు తగ్గడం లేదు. హామీల అమలుకు నిర్దిష్ట కాలపరిమితిని సభలోనే తెలియజేయాలని ఎంపీలు పట్టుబడుతున్నారు. గత రెండు రోజుల నుంచి టీడీపీ, వైసీపీ ఎంపీలు ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీలు తమ నిరసనను ఈరోజు కూడా కొనసాగించనున్నారు. మరికాసేపట్లో వైసీపీ ఎంపీలు హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలవనున్నారు. హామీల అమలుపై స్పష్టత వచ్చే వరకూ ఆందోళన కొనసాగతుందని వైసీపీ ఎంపీలు తెలిపారు.
చంద్రబాబు సూచనల మేరకు...
అలాగే టీడీపీ ఎంపీలు కూడా తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మరికాసేపట్లో కేంద్రమంత్రి సుజనాచౌదరి ఇంట్లో టీడీపీ ఎంపీలు భేటీ కానున్నారు. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. నిన్న సభలో ఇచ్చిన హామీలు ఎప్పటిలోగా అమలు చేస్తారని స్పష్టంగా తెలియజేయాలన్నది టీడీపీ ప్రధాన డిమాండ్. ప్రతి సారీ చేస్తాం.చూస్తాం.. అని చెప్పడమే తప్ప చేసిందేమీ లేదన్నది టీడీపీ ఎంపీల అభిప్రాయం. నాలుగేళ్లయినా ఇంతవరకూ హామీలు అమలు చేయకపోవడంపై అసంతృప్తిలో ఉన్న టీడీపీ నేడు కూడా నిరసననను తెలియజేయాలని నిర్ణయించింది. మరి ఈరోజు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి