ఏపీ విభజన హామీలపై తగ్గేది లేదంటున్న ఏపీ ఎంపీలు..!
- February 07, 2018
పార్లమెంటులో ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీల నిరసనలు కొనసాగనున్నాయి. నిన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉభయ సభల్లో ఏపీ విభజన హామీలపై స్పష్టత ఇచ్చినా.. ప్రధాని హామీ ఇచ్చినా ఎంపీలు తగ్గడం లేదు. హామీల అమలుకు నిర్దిష్ట కాలపరిమితిని సభలోనే తెలియజేయాలని ఎంపీలు పట్టుబడుతున్నారు. గత రెండు రోజుల నుంచి టీడీపీ, వైసీపీ ఎంపీలు ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీలు తమ నిరసనను ఈరోజు కూడా కొనసాగించనున్నారు. మరికాసేపట్లో వైసీపీ ఎంపీలు హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలవనున్నారు. హామీల అమలుపై స్పష్టత వచ్చే వరకూ ఆందోళన కొనసాగతుందని వైసీపీ ఎంపీలు తెలిపారు.
చంద్రబాబు సూచనల మేరకు...
అలాగే టీడీపీ ఎంపీలు కూడా తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మరికాసేపట్లో కేంద్రమంత్రి సుజనాచౌదరి ఇంట్లో టీడీపీ ఎంపీలు భేటీ కానున్నారు. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. నిన్న సభలో ఇచ్చిన హామీలు ఎప్పటిలోగా అమలు చేస్తారని స్పష్టంగా తెలియజేయాలన్నది టీడీపీ ప్రధాన డిమాండ్. ప్రతి సారీ చేస్తాం.చూస్తాం.. అని చెప్పడమే తప్ప చేసిందేమీ లేదన్నది టీడీపీ ఎంపీల అభిప్రాయం. నాలుగేళ్లయినా ఇంతవరకూ హామీలు అమలు చేయకపోవడంపై అసంతృప్తిలో ఉన్న టీడీపీ నేడు కూడా నిరసననను తెలియజేయాలని నిర్ణయించింది. మరి ఈరోజు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!







