యూఏఈ సహనానికి ప్రతీక హిందూ టెంపుల్: సూరి
- February 07, 2018
శనివారం భారత ప్రధాని నరేంద్రమోడీ యూఏఈకి రాబోతున్నారు. రెండు రోజుల యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, అక్కడ జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్కి గౌరవ అతిథిగా హాజరు కాబోతున్నారు. కమ్యూనిటీ మెంబర్స్, బిజినెస్మెన్తోనూ సమావేశమవుతారు. అలాగే వీడియో లింక్ ద్వారా దుబాయ్లో తొలి హిందూ టెంపుల్కి శంకుస్థాపన చేయనున్నారు నరేంద్రమోడీ. యూఏఈలో ఇండియా రాయబారి నవదీప్ సింగ్ సూరి మాట్లాడుతూ, ఈ టెంపుల్, యూఏఈ సహనానికి ప్రతీక అనీ, యూఏఈలో ఇండియన్ కల్చర్కి ప్రతీక అనీ చెప్పారు. యూఏఈ వార్ మెమోరియల్ వాహత్ అల్ కరామా వద్ద నివాళులర్పించనున్నారు మోడీ. యూఏఈలో తొలి హిందూ దేవాలయానికి అనుమతినిచ్చినందుకు యూఏఈ రూలర్స్కి కృతజ్ఞతలు తెలుపుతోంది యూఏఈలోని హిందూ సమాజం. అలాగే యూఏఈలో ఇండియా రాయబారి సూరి, యూఏఈ నాయకత్వానికి ఈ విషయంలో కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







