యూఏఈ సహనానికి ప్రతీక హిందూ టెంపుల్‌: సూరి

- February 07, 2018 , by Maagulf
యూఏఈ సహనానికి ప్రతీక హిందూ టెంపుల్‌: సూరి

శనివారం భారత ప్రధాని నరేంద్రమోడీ యూఏఈకి రాబోతున్నారు. రెండు రోజుల యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, అక్కడ జరిగే వరల్డ్‌ గవర్నమెంట్‌ సమ్మిట్‌కి గౌరవ అతిథిగా హాజరు కాబోతున్నారు. కమ్యూనిటీ మెంబర్స్‌, బిజినెస్‌మెన్‌తోనూ సమావేశమవుతారు. అలాగే వీడియో లింక్‌ ద్వారా దుబాయ్‌లో తొలి హిందూ టెంపుల్‌కి శంకుస్థాపన చేయనున్నారు నరేంద్రమోడీ. యూఏఈలో ఇండియా రాయబారి నవదీప్‌ సింగ్‌ సూరి మాట్లాడుతూ, ఈ టెంపుల్‌, యూఏఈ సహనానికి ప్రతీక అనీ, యూఏఈలో ఇండియన్‌ కల్చర్‌కి ప్రతీక అనీ చెప్పారు. యూఏఈ వార్‌ మెమోరియల్‌ వాహత్‌ అల్‌ కరామా వద్ద నివాళులర్పించనున్నారు మోడీ. యూఏఈలో తొలి హిందూ దేవాలయానికి అనుమతినిచ్చినందుకు యూఏఈ రూలర్స్‌కి కృతజ్ఞతలు తెలుపుతోంది యూఏఈలోని హిందూ సమాజం. అలాగే యూఏఈలో ఇండియా రాయబారి సూరి, యూఏఈ నాయకత్వానికి ఈ విషయంలో కృతజ్ఞతలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com