యూఏఈ సహనానికి ప్రతీక హిందూ టెంపుల్: సూరి
- February 07, 2018
శనివారం భారత ప్రధాని నరేంద్రమోడీ యూఏఈకి రాబోతున్నారు. రెండు రోజుల యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, అక్కడ జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్కి గౌరవ అతిథిగా హాజరు కాబోతున్నారు. కమ్యూనిటీ మెంబర్స్, బిజినెస్మెన్తోనూ సమావేశమవుతారు. అలాగే వీడియో లింక్ ద్వారా దుబాయ్లో తొలి హిందూ టెంపుల్కి శంకుస్థాపన చేయనున్నారు నరేంద్రమోడీ. యూఏఈలో ఇండియా రాయబారి నవదీప్ సింగ్ సూరి మాట్లాడుతూ, ఈ టెంపుల్, యూఏఈ సహనానికి ప్రతీక అనీ, యూఏఈలో ఇండియన్ కల్చర్కి ప్రతీక అనీ చెప్పారు. యూఏఈ వార్ మెమోరియల్ వాహత్ అల్ కరామా వద్ద నివాళులర్పించనున్నారు మోడీ. యూఏఈలో తొలి హిందూ దేవాలయానికి అనుమతినిచ్చినందుకు యూఏఈ రూలర్స్కి కృతజ్ఞతలు తెలుపుతోంది యూఏఈలోని హిందూ సమాజం. అలాగే యూఏఈలో ఇండియా రాయబారి సూరి, యూఏఈ నాయకత్వానికి ఈ విషయంలో కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









