సందర్శకులను ఆకర్షిస్తున్న ఇండియన్ పెవిలియన్

- February 09, 2018 , by Maagulf
సందర్శకులను ఆకర్షిస్తున్న ఇండియన్ పెవిలియన్

సౌదీ అరేబియా: సౌదీ అరేబియా గౌరవ అతిథి దేశమైన భారతదేశ  పెవిలియన్ (గుడారం) వారసత్వం సాంస్కృతిని ప్రతిభింబించే 32 వ జాతీయ ఉత్సవం రియాద్ సమీపంలో జనాద్రియ గ్రామంలో అత్యంత ఉత్సహబరితమైన వాతావరణంలో ప్రారంభమైంది. ఈ ప్రాంతానికి సౌదీలు, ప్రవాసీయులతో సహా పలువురు సందర్శకులు పెద్దఎత్తున హాజరవుతున్నారు. కింగ్ సాడ్ నుండి రెండు పవిత్ర మసీదుల రాజు సల్మాన్ వరకు అదేవిధంగా భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుండి ప్రస్తుత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరకు  చారిత్రాత్మక సందర్శనలకు సంబంధించిన అరుదైన ఫోటోల ప్రదర్శన ఈ పండుగలో ప్రధాన ఆకర్షణగా మారింది.సౌదీ అరేబియా, భారతదేశం మధ్య బలమైన ద్వైపాక్షిక బంధాలను నొక్కిచెప్పే రాజు సల్మాన్ మాటలు మరొక ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంది. భారతదేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో కింగ్ సల్మాన్  బుధవారం ఈ  పెవిలియన్ ను ప్రారంభించారు. సాంప్రదాయ జానపద నృత్యాలతో సహా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పెవిలియన్ లోని థియేటర్ లో ప్రదర్శించబడుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com