ముంబై రైడర్స్పై షహజాద్ గెలుపు
- February 09, 2018
మనామా: సిబిఎ డివిజన్ సి-26 ఓవర్ల మ్యాచ్లో ముంబై రైడర్స్పై షహజాద్ జఫర్ టీమ్ విజయం సాధించింది. ముంబై రైడర్స్ టాస్ గెలవగా, బౌలింగ్ని ఎంచుకుంది. సహజాద్ జఫర్ జట్టు ఓపెనర్ అసిథా అద్భుతమైన సెంచరీని సాధించాడు. ముజిమిల్ 50 పరుగులు సాధించాడు. దాంతో 25 ఓవర్లలో 241 పరుగుల భారీ స్కోర్ షహజాద్ జట్టు సాధించింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై రైడర్స్ కేవలం 122 పరుగులకే ఆలౌట్ అయ్యారు. వకాస్ 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇతర మ్యాచ్లలో లులు జట్టు, ఫాల్కన్ జట్టుపై విజయం సాధించింది. బస్సాలి టైగర్స్ జట్టు, పాంథర్స్ జట్టుని ఓడించింది. ఎసిఎల్ హసీనా, కేరళ జట్టుపై విజయం సాధించింది. కర్నాటక రాయల్స్, పాక్ హాక్స్ని ఓడించింది. పాక్ పాంథర్స్, యూనియన్ గ్రూప్పై విజయం సాధించడం జరిగింది. ఆర్కెెసిటి జట్టు అల్ ఘాద్ కార్గో జట్టుపై గెలుపొందింది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







