ముంబై రైడర్స్‌పై షహజాద్‌ గెలుపు

- February 09, 2018 , by Maagulf
ముంబై రైడర్స్‌పై షహజాద్‌ గెలుపు

మనామా: సిబిఎ డివిజన్‌ సి-26 ఓవర్ల మ్యాచ్‌లో ముంబై రైడర్స్‌పై షహజాద్‌ జఫర్‌ టీమ్‌ విజయం సాధించింది. ముంబై రైడర్స్‌ టాస్‌ గెలవగా, బౌలింగ్‌ని ఎంచుకుంది. సహజాద్‌ జఫర్‌ జట్టు ఓపెనర్‌ అసిథా అద్భుతమైన సెంచరీని సాధించాడు. ముజిమిల్‌ 50 పరుగులు సాధించాడు. దాంతో 25 ఓవర్లలో 241 పరుగుల భారీ స్కోర్‌ షహజాద్‌ జట్టు సాధించింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై రైడర్స్‌ కేవలం 122 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. వకాస్‌ 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇతర మ్యాచ్‌లలో లులు జట్టు, ఫాల్కన్‌ జట్టుపై విజయం సాధించింది. బస్సాలి టైగర్స్‌ జట్టు, పాంథర్స్‌ జట్టుని ఓడించింది. ఎసిఎల్‌ హసీనా, కేరళ జట్టుపై విజయం సాధించింది. కర్నాటక రాయల్స్‌, పాక్‌ హాక్స్‌ని ఓడించింది. పాక్‌ పాంథర్స్‌, యూనియన్‌ గ్రూప్‌పై విజయం సాధించడం జరిగింది. ఆర్‌కెెసిటి జట్టు అల్‌ ఘాద్‌ కార్గో జట్టుపై గెలుపొందింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com