విదేశాల్లో వైద్య విద్య అభ్యసించేలా నీట్ పరీక్ష తప్పనిసరి
- February 12, 2018
ఢిల్లీ : విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఎంబిబిఎస్ చదవాలనుకునే వారు సైతం ఇకపై నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)లో ఉత్తీర్ణులవడం తప్పనిసరి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అర్హులు మాత్రమే విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించేలా నీట్ను తప్పనిసరి చేయడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏటా చైనా, రష్యా వంటి దేశాల్లో వైద్య విద్య అభ్యసించేందుకు దాదాపు 7 వేల మంది విద్యార్థులు భారతదేశం నుంచి వెళ్తున్నారు. వీరు ఎంబిబిఎస్ పూర్తి చేసి తిరిగొచ్చాక భారత్లో వైద్యునిగా పనిచేయాలంటే విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ల పరీక్ష ఎఫ్ఎంజిఇలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. కానీ విదేశాల్లో వైద్య విద్య చదివి వచ్చిన వారిలో 12 నుంచి 15 శాతం మంది మాత్రమే ఎఫ్ఎంజిఇలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. మిగిలిన వారు అక్రమంగా వైద్యసేవలు అందించడం రోగుల ప్రాణులకు ముప్పుగా మారింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అర్హులైన వారు మాత్రమే విదేశాల్లో వైద్య విద్య అభ్యసించేలా నీట్ పరీక్షను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి