18 రాష్ట్రాల్లోని అటవీ సిబ్బందికి అపోలో వైద్యం
- February 14, 2018
ఫిలింనగర్, న్యూస్టుడే: అటవీ సిబ్బందికి వైద్యం అందించేందుకు అపోలో ఆస్పత్రి, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ ఛైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదల, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సీఓఓ కరణ్భల్లా తెలిపారు. ఫిలింనగర్ అపోలో ఆసుపత్రి ప్రాంగణంలో బుధవారం జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ మేరకు ఉపాసన, కరణ్భల్లా ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అనంతరం ఉపాసన మీడియాతో మాట్లాడుతూ అటవీ సిబ్బందికి వైద్య సదుపాయాలు కల్పించడం అత్యంత ప్రాధాన్య అంశమని చెప్పారు. ఇటీవలే నల్లమల అడవుల్లో శిబిరాలు నిర్వహించామనీ, పదకొండు మంది మధుమేహ రోగులను గుర్తించామన్నారు. వారందరికీ అపోలో అత్యుత్తమ చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ ఒప్పందంలో భాగంగా 18 రాష్ట్రాల్లోని అటవీ గార్డులకు వైద్య శిబిరాలను నిర్వహించడం ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రోగనిర్ధరణ చికిత్స సేవలను అందిస్తామన్నారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







