18 రాష్ట్రాల్లోని అటవీ సిబ్బందికి అపోలో వైద్యం
- February 14, 2018
ఫిలింనగర్, న్యూస్టుడే: అటవీ సిబ్బందికి వైద్యం అందించేందుకు అపోలో ఆస్పత్రి, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ ఛైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదల, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సీఓఓ కరణ్భల్లా తెలిపారు. ఫిలింనగర్ అపోలో ఆసుపత్రి ప్రాంగణంలో బుధవారం జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ మేరకు ఉపాసన, కరణ్భల్లా ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అనంతరం ఉపాసన మీడియాతో మాట్లాడుతూ అటవీ సిబ్బందికి వైద్య సదుపాయాలు కల్పించడం అత్యంత ప్రాధాన్య అంశమని చెప్పారు. ఇటీవలే నల్లమల అడవుల్లో శిబిరాలు నిర్వహించామనీ, పదకొండు మంది మధుమేహ రోగులను గుర్తించామన్నారు. వారందరికీ అపోలో అత్యుత్తమ చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ ఒప్పందంలో భాగంగా 18 రాష్ట్రాల్లోని అటవీ గార్డులకు వైద్య శిబిరాలను నిర్వహించడం ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రోగనిర్ధరణ చికిత్స సేవలను అందిస్తామన్నారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







