మవసలాత్ ఎయిర్పోర్ట్ ట్యాక్సీ ధరలు
- February 15, 2018మస్కట్: మవసలాట్ ట్యాక్సీ సర్వీసులకు సంబంధించి ఆదివారం నుంచి ధరలు 50 శాతం వరకు (బేస్ ఫేర్) తగ్గిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్), 3 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. ఇప్పటిదాకా ఈ ధరలు 6 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే కిలోమీటర్కి 200 బైసాస్ చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ధరలు చెల్లుబాటవుతాయి. అయితే ఎయిర్పోర్ట్ ట్యాక్సీలకు మినిమమ్ ఛార్జ్ 5 ఒమన్ రియాల్స్గా నిర్ణయించారు. రాత్రి 10 గంటల తర్వాత రేట్లు 3.6 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతాయి. కిలోమీటర్కి 450 బైసాస్ (30 కిలోమీటర్ల వరకు), 30 కిలోమీటర్లు దాటితే 200 బైసాస్ కిలోమీటర్కి చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 18 నుంచి ఎయిర్పోర్ట్ ట్యాక్సీలను నడపనున్నట్లు మవసలాట్ ఇదివరకే ప్రకటించింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..