మవసలాత్ ఎయిర్పోర్ట్ ట్యాక్సీ ధరలు
- February 15, 2018
మస్కట్: మవసలాట్ ట్యాక్సీ సర్వీసులకు సంబంధించి ఆదివారం నుంచి ధరలు 50 శాతం వరకు (బేస్ ఫేర్) తగ్గిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్), 3 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. ఇప్పటిదాకా ఈ ధరలు 6 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే కిలోమీటర్కి 200 బైసాస్ చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ధరలు చెల్లుబాటవుతాయి. అయితే ఎయిర్పోర్ట్ ట్యాక్సీలకు మినిమమ్ ఛార్జ్ 5 ఒమన్ రియాల్స్గా నిర్ణయించారు. రాత్రి 10 గంటల తర్వాత రేట్లు 3.6 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతాయి. కిలోమీటర్కి 450 బైసాస్ (30 కిలోమీటర్ల వరకు), 30 కిలోమీటర్లు దాటితే 200 బైసాస్ కిలోమీటర్కి చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 18 నుంచి ఎయిర్పోర్ట్ ట్యాక్సీలను నడపనున్నట్లు మవసలాట్ ఇదివరకే ప్రకటించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







