మెక్సికో దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 7.2 మాగ్నిట్యూడ్తో మళ్లీ భూకంపం
- February 16, 2018
మెక్సికో: మెక్సికోను మళ్లీ భూకంపం వణికించింది. మెక్సికో దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 7.2 మాగ్నిట్యూడ్తో శుక్రవారం శక్తిమంతమైన భూకంపం నమోదైంది. దేశ రాజధాని నగరంలోని ప్రజలు, అలాగే ఒయక్సాకా రాష్ట్ర రాజధానిలోను నివాస భవనాల నుంచి, కార్యాలయాల నుంచి బైటికి పరుగులు తీశారు. మెక్సికో ఫసిఫిక్ తీరంలోని గ్రామీణ ప్రాంతాలకు దగ్గరల్లో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు నమోదైంది. గతేడాది సెప్టెంబరు 19న భూకంపంతో మెక్సికోలో 228 మంది, ఆయా రాష్ట్రాల్లో 141 మంది మృత్యువాత పడ్డ దుర్ఘటన విదితమే. అప్పుడు దెబ్బతిన్న భవనాలు మెక్సికోలో ఇంకా అలాగే ఉన్నాయి. దెబ్బతిన్న గృహాల వారికి సహాయక శిబిరాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుత భూకంపం ముందు 7.5తో ప్రారంభమై తర్వాత తీవ్రత 7.2కు తగ్గిందని యూఎస్ జియెలాజికల్ సర్వే పేర్కొంది. ఒక్సాకా రాష్ట్రానికి దక్షిణాన పినోటేపాకు ఈశాన్యంగా 53కిలోమీటర్ల దూరంలో 24 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం నమోదైందని ఈ సర్వే పేర్కొంది. ఇంతవరకు మృతుల సంఖ్యగాని, నష్టాలుగాని రిపోర్టు కాలేదని అధికార వర్గాలు తెలిపాయి. తాను ఇంటి బయట ఒక బెంచీపై కూర్చోగా భూమి కంపించిందని, ఆ సమయంలో రోడ్ల మీది కార్లు ఎటు నుంచి ఎటు వెళుతున్నాయో తెలియలేదని, భయంతో తాను తిరిగి తన గృహంలోకి వెళ్లలేదని మెర్సిడెస్ రోజాస్ హుట్టెరా అనే 57 ఏళ్ల మహిళ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







