చాకచక్యంగా పిల్లల్ని కాపాడిన..భారతీయ సంతతి మహిళ
- February 16, 2018
న్యూయార్క్ : అమెరికాలోని ఫ్లోరిడాలో అత్యంత పాశవికంగా మాజీ విద్యార్థి కాల్పుల సమయంలో శాంతి విశ్వనాథన్ అనే గణిత ఉపాధ్యాయురాలు చాకచక్యతను ప్రదర్శించి అనేక మంది పిల్లల ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే బుధవారం మధ్యాహ్నం పాఠశాల్లోని అలరామ్ రెండోసారి మోగిన వెంటనే కాల్పుల శబ్దం విన్న శాంతి తను బోధిస్తున్న తరగతి గది తలుపులను మూసివేశారు. వెంటనే పిల్లలందరినీ నేలపై పడుకోమని చెప్పి, కిటికీలను కూడా మూసివేసింది. ఇలా చేయడం వల్ల నిందితునికి అది ఖాళీ క్లాస్ రూంలా తోచి ఏమీ చేయకుండా వెళ్లిపోతాడన్న ఆలోచనతో ఆవిధంగా చేసిందని సన్ సెన్టైల్ పేర్కొన్నారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి తలుపు తీయమన్నా తీయలేదని, తాను పోలీసునని చెప్పుకొని తలుపులు తీయించేందుకు ఉన్మాదినే ఈ విధంగా ట్రిక్స్ చేస్తున్నాడని భావించి తలుపు తీయలేదని పత్రిక పేర్కొంది. తలుపు బద్దలు కొట్టుకోండి లేదా కీ తో తలుపును తీసుకోండి, తాను మాత్రం తలుపు తీయనని తెలిపిందని పత్రిక వెల్లడించింది. ఆ తర్వాత పోలీసులు కిటికీలు ఓపెన్ చేయగా, పోలీసులని నిర్ధారించుకుని పిల్లలను బయటకు పంపించారు. ఆమె త్వరగా స్పందించి, చాలా మంది ప్రాణాలను కాపాడిందని ఒక విద్యార్థి తల్లి పత్రికా విలేకరులతో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







