ఇరాన్, భారత్ మధ్య 9 కీలక ఒప్పందాలు

- February 17, 2018 , by Maagulf
ఇరాన్, భారత్ మధ్య 9 కీలక ఒప్పందాలు

న్యూఢిల్లీ: భారత్, ఇరాన్ మధ్య ఇవాళ పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. చర్చల అనంతరం సుమారు తొమ్మిది అగ్రిమెంట్లపై సంతకాలు జరిగాయి. చాబహర్ పోర్ట్ వినియోగం, వైద్యం, వ్యవసాయం, ఆరోగ్యం లాంటి రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. రోహనీ, మోదీలు కలిసి సంయుక్తంగా పోస్టల్ స్టాంపులను కూడా రిలీజ్ చేశారు. రోహనీ రాక వల్ల రెండు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని మోదీ అన్నారు. ప్రెసిడెంట్ రౌహనీ విజన్‌ను అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ద్వైపాక్షిక ఆర్థిక సహకారం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇరు దేశాల మధ్య మైత్రి పెరిగిందని ఇరాన్ అధ్యక్షుడు రౌహనీ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com