నైజీరియాలోని మైద్‌గురి సిటీలోఆత్మహుతి దాడి : 19 మంది మృతి

- February 17, 2018 , by Maagulf
నైజీరియాలోని  మైద్‌గురి సిటీలోఆత్మహుతి దాడి : 19 మంది మృతి

నైజీరియా : నైజీరియాలోని మైద్‌గురి సిటీలో రక్తపుటేరులు పారాయి. అక్కడున్న చేపల మార్కెట్‌లో వరుసగా ముగ్గురు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో 19 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక సైనికుడు ఉన్నారు. 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 22 మంది పరిస్థితి విషమంగా ఉంది. పేలుళ్లు జరిగిన ప్రాంతానికి చేరుకున్న అక్కడి సైనికులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకు ఇస్లామిక్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2.6 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com