నైజీరియాలోని మైద్గురి సిటీలోఆత్మహుతి దాడి : 19 మంది మృతి
- February 17, 2018
నైజీరియా : నైజీరియాలోని మైద్గురి సిటీలో రక్తపుటేరులు పారాయి. అక్కడున్న చేపల మార్కెట్లో వరుసగా ముగ్గురు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో 19 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక సైనికుడు ఉన్నారు. 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 22 మంది పరిస్థితి విషమంగా ఉంది. పేలుళ్లు జరిగిన ప్రాంతానికి చేరుకున్న అక్కడి సైనికులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకు ఇస్లామిక్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2.6 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









