నైజీరియాలోని మైద్గురి సిటీలోఆత్మహుతి దాడి : 19 మంది మృతి
- February 17, 2018
నైజీరియా : నైజీరియాలోని మైద్గురి సిటీలో రక్తపుటేరులు పారాయి. అక్కడున్న చేపల మార్కెట్లో వరుసగా ముగ్గురు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో 19 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక సైనికుడు ఉన్నారు. 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 22 మంది పరిస్థితి విషమంగా ఉంది. పేలుళ్లు జరిగిన ప్రాంతానికి చేరుకున్న అక్కడి సైనికులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకు ఇస్లామిక్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2.6 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







