ప్రవాసీయుల '' ట్రాన్స్ కతర్ ' సుదూర పరుగు కతర్ లో ప్రారంభం
- February 17, 2018
దోహా : కతర్ మరియు ఇతర దేశాల పోటీదారులతో సహా 15 మంది సభ్యుల బృందం సుదూర పరుగుల క్రీడాకారులు ఫిబ్రవరి 23 వ తేదీన 190 కిలోమీటర్ల ' ట్రాన్స్ కతర్ ' కోసం దేశంలోని ఒక చివర నుండి మరో చివర లక్ష్యంగా పరుగులు పెట్టనున్నారు. ఫ్రెంచ్ ప్రవాసియ లోఇకి బర్డన్ నేతృత్వంలోని ఈ బృందం యూకె , బ్రెజిల్, కెనడా, భారతదేశం, మొరాకో, ఫిలిప్పీన్స్, నైజీరియా, స్పెయిన్ నుండి ఇతర సభ్యులను కలిగి ఉంటుంది. దేశంలో ఉన్న కొంతమంది ఆఫ్రికన్ల నుంచి ఈ బృందం విచారణను స్వీకరిస్తోందని సభ్యుడు వినోద్ గోపీనాథ్ చెప్పారు. ఈ పరుగు ఫిబ్రవరి 23 వ తేదీ వేకువజామున ప్రారంభం కానుంది. అదేరోజు మెసయిడ్ సమీపంలో దక్షిణ సరిహద్దులో 20 కిలోమీటర్ల నుండి మరియు ఉత్తర సరిహద్దులో షామల్ పార్కు వద్ద మరుసటి రోజు ఉదయం చేరుకొంటుంది. పోటీదారులు ప్రధానంగా ఎడారి ప్రాంతాల మీదుగా పరులుతీస్తారు . మార్గం వెంట నాలుగు నీటి కేంద్రాలు ఏర్పాటై ఉంటుంది. "మార్గం వెంట, రన్నర్లు సల్వా రోడ్డు, దుఖన్ హైవే, మరియు షమాల్ ఎక్స్ ప్రెస్ మార్గంను దాటుతుందని గోపినాథ్ వివరించారు. "దేశవ్యాప్తంగా మా పరుగులు మారథాన్ 42 కిలోమీటర్ల పరుగు కంటే ఎక్కువ ఆసక్తిని పెంచుతుందని మేము ఆశిస్తున్నాము" అని మరొక భాగస్వామి చెప్పారు.
తాజా వార్తలు
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







