ప్రవాసీయుల '' ట్రాన్స్ కతర్ ' సుదూర పరుగు కతర్ లో ప్రారంభం
- February 17, 2018
దోహా : కతర్ మరియు ఇతర దేశాల పోటీదారులతో సహా 15 మంది సభ్యుల బృందం సుదూర పరుగుల క్రీడాకారులు ఫిబ్రవరి 23 వ తేదీన 190 కిలోమీటర్ల ' ట్రాన్స్ కతర్ ' కోసం దేశంలోని ఒక చివర నుండి మరో చివర లక్ష్యంగా పరుగులు పెట్టనున్నారు. ఫ్రెంచ్ ప్రవాసియ లోఇకి బర్డన్ నేతృత్వంలోని ఈ బృందం యూకె , బ్రెజిల్, కెనడా, భారతదేశం, మొరాకో, ఫిలిప్పీన్స్, నైజీరియా, స్పెయిన్ నుండి ఇతర సభ్యులను కలిగి ఉంటుంది. దేశంలో ఉన్న కొంతమంది ఆఫ్రికన్ల నుంచి ఈ బృందం విచారణను స్వీకరిస్తోందని సభ్యుడు వినోద్ గోపీనాథ్ చెప్పారు. ఈ పరుగు ఫిబ్రవరి 23 వ తేదీ వేకువజామున ప్రారంభం కానుంది. అదేరోజు మెసయిడ్ సమీపంలో దక్షిణ సరిహద్దులో 20 కిలోమీటర్ల నుండి మరియు ఉత్తర సరిహద్దులో షామల్ పార్కు వద్ద మరుసటి రోజు ఉదయం చేరుకొంటుంది. పోటీదారులు ప్రధానంగా ఎడారి ప్రాంతాల మీదుగా పరులుతీస్తారు . మార్గం వెంట నాలుగు నీటి కేంద్రాలు ఏర్పాటై ఉంటుంది. "మార్గం వెంట, రన్నర్లు సల్వా రోడ్డు, దుఖన్ హైవే, మరియు షమాల్ ఎక్స్ ప్రెస్ మార్గంను దాటుతుందని గోపినాథ్ వివరించారు. "దేశవ్యాప్తంగా మా పరుగులు మారథాన్ 42 కిలోమీటర్ల పరుగు కంటే ఎక్కువ ఆసక్తిని పెంచుతుందని మేము ఆశిస్తున్నాము" అని మరొక భాగస్వామి చెప్పారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









