ఐఆర్సీటీసీ వారి దుబాయ్, అబుదాబి పర్యటన ప్యాకేజీ
- February 17, 2018
హైదరాబాద్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మరో ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్, అబుదాబికి నాలుగు రోజుల పర్యటన ప్యాకేజీని వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చి 18 నుంచి మార్చి 31,2018 వరకు సాగే పర్యటనలో భాగంగా దుబాయ్ సిటీటూర్లో భాగంగా కింగ్స్ ప్యాలెస్, ఢోక్రూస్, డెసర్ట్ సఫారి, గ్లోబల్ విల్లేజ్, బుర్జ్ అల్ అరబ్ 7 స్టార్ హోటల్, బుర్జ్ఖలీఫ, దుబాయ్ మాల్తోపాటు అబుదాబితో పాటు అబుదాబి గ్రాండ్ మాస్క్, హెరిటేజ్ విలేజ్ వంటి ప్రాంతాల పర్యటన ఉంటుంది. ఇందులో భాగంగా త్రీస్టార్ హోటల్ వసతి, ఏసీ ప్రయాణం, గైడ్ను అందిస్తారు. ఒక్కొక్కరికి ప్యాకేజీలో భాగంగా చార్జీని రూ. 61,042గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







