ఐఆర్సీటీసీ వారి దుబాయ్, అబుదాబి పర్యటన ప్యాకేజీ
- February 17, 2018
హైదరాబాద్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మరో ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్, అబుదాబికి నాలుగు రోజుల పర్యటన ప్యాకేజీని వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చి 18 నుంచి మార్చి 31,2018 వరకు సాగే పర్యటనలో భాగంగా దుబాయ్ సిటీటూర్లో భాగంగా కింగ్స్ ప్యాలెస్, ఢోక్రూస్, డెసర్ట్ సఫారి, గ్లోబల్ విల్లేజ్, బుర్జ్ అల్ అరబ్ 7 స్టార్ హోటల్, బుర్జ్ఖలీఫ, దుబాయ్ మాల్తోపాటు అబుదాబితో పాటు అబుదాబి గ్రాండ్ మాస్క్, హెరిటేజ్ విలేజ్ వంటి ప్రాంతాల పర్యటన ఉంటుంది. ఇందులో భాగంగా త్రీస్టార్ హోటల్ వసతి, ఏసీ ప్రయాణం, గైడ్ను అందిస్తారు. ఒక్కొక్కరికి ప్యాకేజీలో భాగంగా చార్జీని రూ. 61,042గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









