ఐఆర్సీటీసీ వారి దుబాయ్, అబుదాబి పర్యటన ప్యాకేజీ
- February 17, 2018
హైదరాబాద్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మరో ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్, అబుదాబికి నాలుగు రోజుల పర్యటన ప్యాకేజీని వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చి 18 నుంచి మార్చి 31,2018 వరకు సాగే పర్యటనలో భాగంగా దుబాయ్ సిటీటూర్లో భాగంగా కింగ్స్ ప్యాలెస్, ఢోక్రూస్, డెసర్ట్ సఫారి, గ్లోబల్ విల్లేజ్, బుర్జ్ అల్ అరబ్ 7 స్టార్ హోటల్, బుర్జ్ఖలీఫ, దుబాయ్ మాల్తోపాటు అబుదాబితో పాటు అబుదాబి గ్రాండ్ మాస్క్, హెరిటేజ్ విలేజ్ వంటి ప్రాంతాల పర్యటన ఉంటుంది. ఇందులో భాగంగా త్రీస్టార్ హోటల్ వసతి, ఏసీ ప్రయాణం, గైడ్ను అందిస్తారు. ఒక్కొక్కరికి ప్యాకేజీలో భాగంగా చార్జీని రూ. 61,042గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి