ఇక దుబాయిలో కానరాని 'లాస్ట్ మైల్' కష్టాలు - కార్లను అద్దెకు తీసుకొనే యోచనలో అర్.టి.ఎ.
- November 26, 2015
రోడ్ ట్రాన్స్పోర్ట్ అధారిటీ , దుబాయిలో 'లాస్ట్ మైల్' ను చేరడానికి అద్దె ర్లను వినియోగించే విషయమై సుదీర్ఘ చర్చలలో ఉంది. 'లాస్ట్ మైల్' అంటే ఒక వ్యక్తీ మెట్రో, రైలు, ట్రాం లేదా బస్సు నుండి దిగిన అనంతరం తన గమ్యస్థానం - అంటే ఇల్లు లేదా కార్యాలయానికి చేరడానికి ప్రయనించవలసిన దూరం అని అర్.టి.ఎ. లైసెన్సింగ్ ఏజెన్సీ సి.ఈ.ఓ.అహ్మద్ బహ్రోజ్యాన్ తెలిపారు. ప్రస్తుతం ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేనందున, ఈ దూరం నడక ద్వారా అధిగమించవలసి వస్తున్నప్పటికీ, అనేక మంది దుబాయి వాసులు, ముఖ్యంగా వేసవికాలంలో ఇందుకు ఇష్టపడడం లేదు. ఈ విధమైన 'కార్ రెంటల్' విధానం ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, జర్మనీ, నెదర్లండ్స్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విజయవంతమయిందని, ఇందుకోసం ఎలక్ట్రానిక్ కార్లు, పోడ్ కార్లు మరియు చోదక రహిత వాహనాలు కూడా పరిశీలనలో ఉన్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







