వదిలివేయబడిన 33 వాహనాలు అబూధాబిలో స్వాధీనం
- February 18, 2018
అబుదాబి: నగరంలో చాలా కాలం నుండి యజమానులచేత వదిలివేయబడిన 33 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అబూధాబి సిటీ మున్సిపాలిటీ తెలిపింది. సిటీ మునిసిపల్ మరియు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంట్రల్ ద్వారా నగరంలో ఒక తనిఖీని నిర్వహించారు. ఈ ప్రచారం అనేక ప్రాంతాలలో కొనసాగింది . రాజధానిలో దీర్ఘ కాలం పాటు గమనింపబడని వదిలివేసిన వాహనాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఫలితంగా. ఈ వాహనాలను స్వాధీనం చేసుకొని నగరానికి దూరంగా ఉన్న యార్డ్ వద్దకు తరలించారు. మున్సిపాలిటీ అబూధాబీలో 2012 చట్టం (2) నిబంధనల అమలులో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు హెల్త్ అండ్ ట్రాంక్విలిటీని నిర్వర్తించడం కొనసాగుతాయని పేర్కొంది. ఈ చట్టం లోని నిబంధనల ప్రకారం 3,000 దిర్హామ్ జరిమానా నేరస్థులకు జారీ చేయబడుతుందని మున్సిపాలిటీ తెలిపింది. ఇటువంటి ప్రచారాల ద్వారా, మునిసిపాలిటీ పబ్లిక్ ప్రాంతాలలో దీర్ఘకాలిక సౌకర్యాలలో వాహనాలను విడిచిపెట్టకుండా ప్రజలకు అవగాహన కల్గించేందుకు ప్రయత్నిస్తుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి