వదిలివేయబడిన 33 వాహనాలు అబూధాబిలో స్వాధీనం
- February 18, 2018
అబుదాబి: నగరంలో చాలా కాలం నుండి యజమానులచేత వదిలివేయబడిన 33 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అబూధాబి సిటీ మున్సిపాలిటీ తెలిపింది. సిటీ మునిసిపల్ మరియు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంట్రల్ ద్వారా నగరంలో ఒక తనిఖీని నిర్వహించారు. ఈ ప్రచారం అనేక ప్రాంతాలలో కొనసాగింది . రాజధానిలో దీర్ఘ కాలం పాటు గమనింపబడని వదిలివేసిన వాహనాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఫలితంగా. ఈ వాహనాలను స్వాధీనం చేసుకొని నగరానికి దూరంగా ఉన్న యార్డ్ వద్దకు తరలించారు. మున్సిపాలిటీ అబూధాబీలో 2012 చట్టం (2) నిబంధనల అమలులో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు హెల్త్ అండ్ ట్రాంక్విలిటీని నిర్వర్తించడం కొనసాగుతాయని పేర్కొంది. ఈ చట్టం లోని నిబంధనల ప్రకారం 3,000 దిర్హామ్ జరిమానా నేరస్థులకు జారీ చేయబడుతుందని మున్సిపాలిటీ తెలిపింది. ఇటువంటి ప్రచారాల ద్వారా, మునిసిపాలిటీ పబ్లిక్ ప్రాంతాలలో దీర్ఘకాలిక సౌకర్యాలలో వాహనాలను విడిచిపెట్టకుండా ప్రజలకు అవగాహన కల్గించేందుకు ప్రయత్నిస్తుంది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







