అమరావతి రైతుల సింగపూర్ టూర్
- February 18, 2018అమరావతి: సింగపూర్ అభివృద్ధి విశేషాలను తెలుసుకునేందుకు సీఆర్డీయే ఆధ్వర్యంలో రాజధాని రైతుల మూడో బృందం ఆదివారం ఆ దేశ పర్యటనకు బయలుదేరింది. మొత్తం 39 మంది రైతులు వెలగపూడి సచివాలయం నుంచి బస్సులో గన్నవరం ఎయిర్పోర్ట్కు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 23న వారు పర్యటన ముగించుకుని తిరిగి వస్తారు. పర్యటనలో అబ్బరాజుపాలెం, అనంతవరం, బోరుపాలెం, దొండపాడు, కృష్ణాయపాలెం, లింగాయపాలెం, మల్కాపురం, మందడం, నేలపాడు, నిడమర్రు, పెనుమాక, తుళ్లూరు, ఐనవోలు గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. వీరికి, సింగపూర్ అధికారులకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించేందుకు సీఆర్డీయే అధికారులు కూడా రైతులతో పాటు వెళ్లారు. ఇప్పటికే రెండు విడతలుగా 64మంది రైతులు సింగపూర్ పర్యటనకు వెళ్లి వచ్చారు. సింగపూర్ తరహాలో అమరావతి అభివృద్ధి చెందేలా రైతులు తోడ్పాటునందించేందుకు సీఆర్డీయే ఈ పర్యటనలు ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్