రోడ్డుపై నడుస్తూ మొబైల్ ఫోన్ వినియోగించొద్దు
- February 20, 2018
రోడ్డుపై నడిచే పాదచారులు, ఆ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించడం ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అబుదాబీ పోలీస్, పాదచారులకు కలిగే ప్రమాదాల్ని నివారించడం కోసం, పాదచారులు నడుస్తూ ఫోన్ మాట్లాడకూడదని హెచ్చరించింది. ఫోన్లో మాట్లాడటం, టెక్స్ట్ మెసేజ్ చేయడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయని అధికారులు చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా రోడ్డు దాటేప్పుడు ఫోన్లో మాట్లాడటం, టెక్స్ట్ ఛాటింగ్లో పాదచారులు మునిగిపోవడం వల్ల వేగంగా వచ్చే వాహనాల్ని గుర్తించలేకపోతున్నారని, తద్వారా ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని పోలీసులు చెప్పారు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడినా, టెక్స్ట్ ఛాట్ చేసినా 400 దిర్హామ్ల జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత







