రోడ్డుపై నడుస్తూ మొబైల్ ఫోన్ వినియోగించొద్దు
- February 20, 2018
రోడ్డుపై నడిచే పాదచారులు, ఆ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించడం ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అబుదాబీ పోలీస్, పాదచారులకు కలిగే ప్రమాదాల్ని నివారించడం కోసం, పాదచారులు నడుస్తూ ఫోన్ మాట్లాడకూడదని హెచ్చరించింది. ఫోన్లో మాట్లాడటం, టెక్స్ట్ మెసేజ్ చేయడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయని అధికారులు చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా రోడ్డు దాటేప్పుడు ఫోన్లో మాట్లాడటం, టెక్స్ట్ ఛాటింగ్లో పాదచారులు మునిగిపోవడం వల్ల వేగంగా వచ్చే వాహనాల్ని గుర్తించలేకపోతున్నారని, తద్వారా ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని పోలీసులు చెప్పారు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడినా, టెక్స్ట్ ఛాట్ చేసినా 400 దిర్హామ్ల జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి