మొజాంబిక్ రాజధాని మపుటోనగరంలోకుప్పకూలిన చెత్తకుప్ప
- February 20, 2018
మొజాంబిక్- 17మంది మృతి, పలువురికి గాయాలు
మపుటో: మొజాంబిక్ రాజధాని మపుటో నగరంలో సోమవారం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నగర శివార్లలో వున్న ఒక చెత్తకుప్ప కుప్పకూలిన ఘటనలో కనీసం 17 మంది మరణించారని, పలువురు గాయపడ్డారని అధికారులు చెప్పారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ పరిసర ప్రాంతాలలో నివశించే వారంతా నిద్రలో వున్నారని, భారీ వర్షాలతో కుంగిన చెత్తకుప్ప పక్కనే వున్న ఇళ్లపై కూలిపోవటంత వారంతా తమ ఇళ్లలోనే సజీవ సమాధి అయ్యారని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అధికారులు మంగళవారం ఉదయం నుండి అక్కడ సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది శిధిలాల్లో చిక్కుకున్న వారితో పాటు మృతదేహాల కోసం గాలింపు ప్రారంభించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకునే అంశంపై చర్చించేందుకు అధికారయంత్రాంగం మంగళవారం భేటీ అవుతోందని మపుటో సిటీ గవర్నర్ యోలాండా సించురా చెప్పారు. ఈ దుర్ఘటనలో ఇళ్లు కోల్పోయిన వారిని గుర్తించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని ఆమె వివరించారు రాజధాని మపుటోనగరంలోకుప్పకూలిన చెత్తకుప్ప.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







