పెళ్లిపీటలెక్కనున్న రజనీ హీరోయిన్ అమీ జాక్సన్!
- February 20, 2018
పెళ్లిపీటలెక్కనున్న రజనీ హీరోయిన్!
హైదరాబాద్: నటి అమీ జాక్సన్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతోంది. బ్రిటన్కి చెందిన వ్యాపారవేత్త జార్జితో అమీ కొంతకాలంగా ప్రేమలో ఉంది. వ్యాలెంటైన్స్ డే రోజున అమీ..తన ప్రియుడికి విష్ చేస్తూ ఫొటో పోస్ట్ చేయడంతో ఆమె ప్రేమ విషయం అందరికీ తెలిసింది. అమీ స్వస్థలమైన బ్రిటన్ వెళ్లిన ప్రతీసారి తన ప్రియుడితోనే గడుపుతోందట. ఈ ఏడాదిలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసలైతే గతేడాదే వీరిద్దరి పెళ్లి జరగాల్సి ఉందట. కానీ సినిమాలతో బిజీగా ఉండడంతో పెళ్లిని వాయిదా వేసినట్లు సమాచారం.
2010లో వచ్చిన 'మద్రాసపట్టణం' చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చింది అమీ. ఆ తరువాత బాలీవుడ్లో వచ్చిన 'ఏక్ దివానా థా' చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో వచ్చిన 'ఏ మాయ చేశావె' సినిమాకు ఇది రీమేక్గా వచ్చింది. ఆ తరువాత 'సింగ్ ఈజ్ బ్లింగ్', 'ఎవడు', 'ఐ' తదితర చిత్రాల్లో నటించింది. రజనీకాంత్, అమీ జాక్సన్ జంటగా నటించిన '2.0' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్







