పెళ్లిపీటలెక్కనున్న రజనీ హీరోయిన్ అమీ జాక్సన్!
- February 20, 2018
పెళ్లిపీటలెక్కనున్న రజనీ హీరోయిన్!
హైదరాబాద్: నటి అమీ జాక్సన్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతోంది. బ్రిటన్కి చెందిన వ్యాపారవేత్త జార్జితో అమీ కొంతకాలంగా ప్రేమలో ఉంది. వ్యాలెంటైన్స్ డే రోజున అమీ..తన ప్రియుడికి విష్ చేస్తూ ఫొటో పోస్ట్ చేయడంతో ఆమె ప్రేమ విషయం అందరికీ తెలిసింది. అమీ స్వస్థలమైన బ్రిటన్ వెళ్లిన ప్రతీసారి తన ప్రియుడితోనే గడుపుతోందట. ఈ ఏడాదిలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసలైతే గతేడాదే వీరిద్దరి పెళ్లి జరగాల్సి ఉందట. కానీ సినిమాలతో బిజీగా ఉండడంతో పెళ్లిని వాయిదా వేసినట్లు సమాచారం.
2010లో వచ్చిన 'మద్రాసపట్టణం' చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చింది అమీ. ఆ తరువాత బాలీవుడ్లో వచ్చిన 'ఏక్ దివానా థా' చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో వచ్చిన 'ఏ మాయ చేశావె' సినిమాకు ఇది రీమేక్గా వచ్చింది. ఆ తరువాత 'సింగ్ ఈజ్ బ్లింగ్', 'ఎవడు', 'ఐ' తదితర చిత్రాల్లో నటించింది. రజనీకాంత్, అమీ జాక్సన్ జంటగా నటించిన '2.0' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి