'స్పీడున్నోడు' మరో కొత్త సినిమా
- February 21, 2018
జయ జానకీ నాయక మంచి హిట్ కొట్టడంతో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'సాక్ష్యం' చిత్రం ఇంకా నిర్మాణంలో ఉండగానే ఈ 'స్పీడున్నోడు' మరో కొత్త సినిమాకు సైన్ చేశాడు. రేపటి(గురువారం) నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. రామానాయుడు స్టూడియోలో రేపు ఉదయం 9గంటలకు ఈ చిత్ర షూటింగ్ను ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంతో శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానరుపై నవీన్ సొంటినేని (నాని) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడిగా చోటా కె. నాయుడు పని చేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







