'స్పీడున్నోడు' మరో కొత్త సినిమా
- February 21, 2018
జయ జానకీ నాయక మంచి హిట్ కొట్టడంతో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'సాక్ష్యం' చిత్రం ఇంకా నిర్మాణంలో ఉండగానే ఈ 'స్పీడున్నోడు' మరో కొత్త సినిమాకు సైన్ చేశాడు. రేపటి(గురువారం) నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. రామానాయుడు స్టూడియోలో రేపు ఉదయం 9గంటలకు ఈ చిత్ర షూటింగ్ను ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంతో శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానరుపై నవీన్ సొంటినేని (నాని) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడిగా చోటా కె. నాయుడు పని చేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







