నిత్యా మీనన్ మరో వినూత్నమూవీ 'ప్రాణ'..
- February 21, 2018
నిత్యా మీనన్ మరో వినూత్న చిత్రంలో నటించింది.. ఈ మూవీ మొత్తం ఒకే ఒక్క పాత్ర ఉండటం విశేషం.. ప్రాణ పేరుతో ఈ చిత్రాన్ని మలయాళ, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. వి.కె. ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి, ప్రముఖ సినిమాటో గ్రాఫర్ పీసీ శ్రీరామ్, నిత్యామీనన్ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సౌండ్ డిజైనింగ్ ఈ సినిమా ప్రత్యేకతని చెబుతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి ఈ సినిమాకి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మొదటిసారిగా ఈ సినిమా కోసం 'సరౌండ్ సింక్ సౌండ్ టెక్నాలజీ'ని ఉపయోగిస్తున్నారు. డబ్బింగ్ అనేది లేకుండగా షూటింగ్ సమయంలోనే డైలాగ్స్ రికార్డు అవుతాయని అంటున్నారు. "నాలుగు భాషల్లో రూపొందుతున్నందు వలన ఒక్కోసారి ఒక్కో భాషలో డైలాగ్ చెప్పాల్సి వచ్చింది .. కష్టమే అయినా తప్పలేదు" అని తాజా ఇంటర్వ్యూలో నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రజలకు నచ్చుతుందనే ధీమాను వ్యక్తం చేసింది నిత్యా..
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







