రెజీనా బాలీవుడ్లో ఎంట్రీ
- February 21, 2018
హైదరాబాద్ : దక్షిణాది నుంచి త్రిష, కాజల్ అగర్వాల్తో పాటు పలువురు కథానాయికలు హిందీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా రెజీనా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నది. రాజ్కుమార్రావ్, సోనమ్కపూర్ ప్రధాన పాత్రల్లో ఎక్ లడికీ కో దేఖాతో ఐసా లగా పేరుతో ఓ మూవీ తెరకెక్కుతున్నది. విధు వినోద్చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి షెల్లీ చోప్రా ధార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో రెజీనా నటించనున్నది. గత కొంతకాలంగా తెలుగు, తమిళ భాషల్లో నటనకు ఆస్కారమున్న పాత్రల్లో కనిపిస్తున్నది రెజీనా. ఈ చిత్రాల్లో రెజీనా అభినయానికి ముగ్ధులైన బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. రెజీనాతో పాటు అనిల్కపూర్, జూహీచావ్లా ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకురానున్నది. గతంలో హిందీ చిత్రం ఆంఖేన్-2లో నటించే అవకాశం రెజీనాను వరించింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా సెట్స్పైకిరాలేదు.
తాజా వార్తలు
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!







