రెజీనా బాలీవుడ్లో ఎంట్రీ
- February 21, 2018
హైదరాబాద్ : దక్షిణాది నుంచి త్రిష, కాజల్ అగర్వాల్తో పాటు పలువురు కథానాయికలు హిందీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా రెజీనా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నది. రాజ్కుమార్రావ్, సోనమ్కపూర్ ప్రధాన పాత్రల్లో ఎక్ లడికీ కో దేఖాతో ఐసా లగా పేరుతో ఓ మూవీ తెరకెక్కుతున్నది. విధు వినోద్చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి షెల్లీ చోప్రా ధార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో రెజీనా నటించనున్నది. గత కొంతకాలంగా తెలుగు, తమిళ భాషల్లో నటనకు ఆస్కారమున్న పాత్రల్లో కనిపిస్తున్నది రెజీనా. ఈ చిత్రాల్లో రెజీనా అభినయానికి ముగ్ధులైన బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. రెజీనాతో పాటు అనిల్కపూర్, జూహీచావ్లా ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకురానున్నది. గతంలో హిందీ చిత్రం ఆంఖేన్-2లో నటించే అవకాశం రెజీనాను వరించింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా సెట్స్పైకిరాలేదు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







