పది కోట్ల విరాళం ఇచ్చిన ఎమ్మా వాట్సన్
- February 23, 2018
లండన్: బ్రిటన్లో స్త్రీ, పురుషుల సమాన హక్కుల కోసం, మహిళా సాధికారిత కోసం ‘టైమీస్ అప్’ ఉద్యమాన్ని నిర్వహిస్తున్న ప్రముఖ బ్రిటన్ నటి, ఫెమినిస్ట్ ఎమ్మా వాట్సన్ ‘బ్రిటన్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఫండ్’కు పది కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. ఇటు లండన్, అటు న్యూయార్క్ సబ్వేలలో ఫెమినిస్టు పుస్తకాలను ఉద్దేశపూర్వకంగా వదిలేసి రావడం వల్ల తొలుత వార్తల్లోకి ఎక్కిన ఆమె ఆ తర్వాత ‘టైమీస్ అప్’ ఉద్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఫెమినిస్ట్గా పేరు తెచ్చుకున్నారు.
‘మహిళల సాధికారిత కోసం, పనిచేసే చోట స్త్రీ, పురుషులను సమానంగా చూసే సమ న్యాయం కోసం కొనసాగిస్తున్న ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తం కావాలి. మహిళలు–మహిళలతో, మహిళలు, పురుషులతో భుజంభుజం కలుపుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దీనికి ప్రజలందరూ తమ వంతు సహకారాన్ని అందించాలి. ముఖ్యంగా సమానత్వ నిధికి విరాళాలు విరివిగా అందించాలి’ అని పిలుపుతో కూడిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో విడుదల చేశారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







