దూసుకొస్తున్న చరణ్ విమానాలు..
- May 05, 2015
' ట్రూ జెట్ ' పేరుతో టాలీవుడ్ నటుడు రామ్చరణ్ తేజ బ్రాండ్ అంబాసిడర్గా టర్బో మేఘ విమాన సేవలు ప్రారంభంకానున్నాయి. ఈ సేవలు జూన్ నెల నుండి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసం చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నామని , జూన్ నెలాఖరులోగా తొలి విమానం ఎగురుతుందని టర్బో మేఘ ఎయిర్వేస్ ఫౌండర్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. డీజీసీఏ అనుమతులు కూడా తుది దశలో ఉన్నాయన్నారు. ఒక్క తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా అటు ఉత్తరాదీన అహ్మదాబాద్ , పుణే , గోవాలలో కూడా ఈ సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఉమేష్ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా రీజనల్ షెడ్యూల్ ఎయిర్లైన్స్ సర్వీసులను కూడా టర్బో మేఘ ఎయిర్వేస్ ఇప్పుడు ప్రారంభించనుంది. ముఖ్యంగా దేశంలో పెద్ద పెద్ద నగరాలతో పాటు చిన్న పట్టణాలలో కూడా విమాన సర్వీసులకు డిమాండ్ అధికంగా ఉందని , దీన్ని దృష్టిలో పెట్టుకొని ద్వితీయశ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ఉమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమాన ఇంధనంపై పన్నులను తగ్గించిందని , తెలంగాణ ప్రభుత్వం కూడా పన్నులను తగ్గించాలని కోరుతున్నామని ఉమేశ్ అన్నారు .
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









