రామ్ తో జోడీ కట్టనున్న రాశీఖన్నా
- May 05, 2015
రామ్ హీరోగా 'శివం' అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని స్రవంతీ మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా నేహాశర్మ చెల్లెలు అయిషాను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం రామ్ సరసన హీరోయిన్గా రాశిఖన్నాను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. రాశిఖన్నా కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా వివరాలు ప్రకటించనున్నారు. ఈ అమ్మడు నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా మంచి విజయం సాధించి గోల్డెన్ లెగ్ అనిపించుకుంటోంది. ప్రస్తుతం రామ్ నటించిన 'పండగ చేస్కో' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదల అయిన వెంటనే 'శివం' రూపొందనుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









