రామ్ తో జోడీ కట్టనున్న రాశీఖన్నా
- May 05, 2015
రామ్ హీరోగా 'శివం' అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని స్రవంతీ మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా నేహాశర్మ చెల్లెలు అయిషాను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం రామ్ సరసన హీరోయిన్గా రాశిఖన్నాను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. రాశిఖన్నా కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా వివరాలు ప్రకటించనున్నారు. ఈ అమ్మడు నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా మంచి విజయం సాధించి గోల్డెన్ లెగ్ అనిపించుకుంటోంది. ప్రస్తుతం రామ్ నటించిన 'పండగ చేస్కో' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదల అయిన వెంటనే 'శివం' రూపొందనుంది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







