వచ్చే మూడేళ్లలో ఎటువంటి ఫీజుల భారాన్ని మోపం అని ప్రకటించిన యూఏఈ ప్రధాన మంత్రి
- March 01, 2018
అబుదాబి: రానున్న మూడేళ్లలో యూఏఈ ఫెడరల్ ఫీజుల్లో ఎలాంటి పెరుగుదల ఉండబోదని యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ కింగ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం భరోసా ఇచ్చారు. విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థిరత్వం, పారిశ్రామిక, వాణిజ్య రంగాలను అభివృద్ధి చేయాలని, ఆ చర్యలతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆరోగ్యం, రవాణా, భవిష్యత్తు ఉపకరణాలు, నీరు, వాతావరణం, అంతరిక్ష సాంకేతికాభివృద్ధి వంటి రంగాల అభివృద్ధికి తొలుత ప్రాధాన్యత ఇస్తామని, కేబినెట్ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించానని షేక్ మొహమ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









